మళయాళ సూపర్ హిట్ మూవీ అయ్యప్పనుం కోషియం కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తారని తెలుస్తుంది. ఈ సినిమాలో రానా కూడా నటిస్తాడని టాక్. సినిమాకు సంబందించిన అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ దసరాకి వచ్చింది. మళయాళంలో బిజూ మీనన్ వేసిన పాత్రలో పవన్ కనిపిస్తారు. అయితే ఆ సినిమాలో అతని పాత్ర కొద్దిగా పృధ్వి రాజ్ పాత్ర కన్నా ఓ లైన్ కింద ఉంటుంది.

అయితే తెలుగులో బిజూ మీనన్ పాత్రని పవర్ స్టార్ చేస్తున్నాడు కాబట్టి ఆ పాత్రకు అదనపు సీన్స్ యాడ్ చేస్తారని చెప్పొచ్చు. పవర్ స్టార్ ఇమేజ్ కు తగినట్టుగా ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది. అయితే ఈ సినిమాకు పవన్ కేవలం 25 రోజులు మాత్రమే డేట్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ పాతిక రోజుల్లోనే పవన్ తో ఉన్న సీన్స్ షూట్ చేయాల్సి ఉంటుంది. అజ్ఞాతవాసి తర్వాత కొద్దిపాటి గ్యాప్ ఇచ్చిన పవన్ వరుస సినిమాలు చేస్తున్నాడు.

తను ఉన్న సినిమాలన్ని ఒకేసారి మొదలుపెట్టి తన పోర్షన్ చకచకా చేసి ఆ తర్వాత మిగతా పోర్షన్స్ షూట్ చేసేలా షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాడు. తప్పకుండా అయ్యప్పనుం కోషియం సినిమా తెలుగు రీమేక్ లో పవర్ స్టార్ చాలా ప్లస్ అవుతాడని చెప్పొచ్చు. ఈ సినిమా కోసం రానా కూడా డేట్స్ ఇవ్వాల్సి ఉంది. ఈ సినిమాకు బిల్లా రంగా అని టైటిల్ పెడతాడని. త్రివిక్రం ఈ టైటిల్ ను సూచించారని అంటున్నారు.                                                

మరింత సమాచారం తెలుసుకోండి: