ఈ విషయంలో రాజమౌళి మర్యాదగా వ్యవహరించాలని లేకపోతే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు చిత్ర దర్శకుడు ఈ కథలో కొన్ని మార్పులు చేసే అవకాశాలు ఉండవచ్చు అని టాలీవుడ్ జనాలు భావిస్తున్నారు. ఈ సినిమాలో ఇప్పటికే కొన్ని సన్నివేశాలను తొలగించారని మరి కొన్ని సన్నివేశాల విషయంలో కూడా త్వరలోనే ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. రాజకీయంగా ఈ సినిమా విషయంలోదుమారం రేగక ముందే చాలా వరకు కూడా జాగ్రత్తగా ముందుకు వెళ్లాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.
గతంలో పద్మావతి అనే సినిమాను ఇలాగే ఆపేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత చిత్ర దర్శకుడు చాలా సన్నివేశాలను సినిమా నుంచి తొలగించారు. దీనితో సినిమా లో పట్టు లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో రాజమౌళి కూడా కొన్ని కీలక సన్నివేశాలను తొలగించి అవకాశాలు ఉండవచ్చు అని భావిస్తున్నారు. దీనిపై త్వరలోనే ఒక క్లారిటీ రానుంది. ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది ఏంటి అనేది లేదు కానీ ఈ సినిమా షూటింగ్ మాత్రం ప్రస్తుతం వికారాబాద్ జిల్లాలో జరుగుతోంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్లు గా ఇద్దరు నటిస్తున్న సంగతి తెలిసిందే. అటు బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడు.