ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా గీత గోవిందం ఫేమ్ పరశురామ్ డైరెక్షన్లో సర్కారు వారి పాటఅనే చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు పుట్టినరోజు సందర్బంగా రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ కి అద్భుతమైన స్పందన వచ్చింది.  కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించబోతున్న ఈ చిత్రం షూటింగ్ ను నవంబర్ నుండీ అమెరికాలో మొదలుపెట్టాలని నిర్మాతలు భావించారు. కానీ చిత్ర యూనిట్ సభ్యులకు వీసాల సమస్య తలెత్తడంతో … ఆ షెడ్యూల్ క్యాన్సిల్ అయ్యింది. నటీనటులు మరియు సాంకేతిక నిపుణులకు ఫోన్ చేసి కాల్ షీట్లు క్యాన్సిల్ చేసుకోమని చెప్పారట దర్శక నిర్మాతలు.

ఇంకేముంది ఈ చిత్రం ఆగిపోయినట్టే అనే ప్రచారం మొదలైంది.అంతేకాదు మహేష్ కూడా ఈ చిత్రాన్ని పక్కనపెట్టేసి త్రివిక్రమ్ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకువెళ్ళాలి అని భావిస్తున్నాడని కూడా టాక్ నడిచింది. అయితే ఆ ప్రచారంలో నిజం లేదు.2021 జనవరి 2 లేదా సంక్రాంతి పూర్తయిన తరువాత సర్కారు వారి పాట షూటింగ్ అమెరికాలో మొదలుకానుందట. ఈ లోపు మహేష్ బాబు- త్రివిక్రమ్ ల సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం లేదా అంటే ఆ చిత్రం షూటింగ్ మొదలుపెట్టడం కూడా జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది.

ఏమైనా ఓ స్టార్ హీరో ఒకేసారి రెండు పెద్ద సినిమాలను మొదలుపెట్టడం అంటే డేరింగ్ స్టెప్ అనే చెప్పాలి. అతడు సినిమా వరకూ మహేష్ బాబు ఒకేసారి రెండేసి సినిమాల్లో నటిస్తూ వచ్చేవాడు. కానీ ఆ చిత్రం తరువాత అతను పెద్ద స్టార్ అయ్యాడు. అప్పటి నుండీ ఇలా రెండు సినిమాల షూటింగ్లలో పాల్గొన్నది లేదు.ఏమైనా ఆయన ఫ్యాన్స్ కు అయితే ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇక ఈ సినిమాల తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళితో సినిమా చెయ్యబోతున్నాడు. ఇది పాన్ ఇండియా లెవల్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఈ సినిమాపై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలే వున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: