కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా పూర్తి లాక్ డౌన్ విధించి ఇటీవలే లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా షూటింగ్స్ అనుమతులు రావడంతో స్టార్ హీరోలు ఒక్కొక్కరుగా సెట్స్ పైకి వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ హీరోగా రాబోతున్న 'పుష్ప' సినిమా షూటింగ్ విషయమై పక్కాగా ప్లాన్ చేశారట సుకుమార్. ఇకపై అస్సలు ఆలస్యం చేయకూడదని, నవంబర్ నెలలో షూటింగ్ స్టార్ట్ చేయాలని డిసైడ్ అయ్యారట. ఒక్కసారి స్టార్ట్ చేస్తే ఇక స్టాప్ చేయకూడదని అనుకుంటున్నారట యూనిట్.

మరో వారం రోజుల్లో ఆంధ్రలోని రంప చోడవరం, మారేడిమిల్లి ప్రాంతాల్లో 'పుష్ప' మూవీ షూట్ ప్రారంభం కానుందని తెలిసింది. అక్కడి 'ఉడ్స్' రిసార్ట్ మొత్తాన్ని యూనిట్ కోసం రిజర్వ్ చేసి ఉంచారట. ఈ షెడ్యూల్‌లో చాలా పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసేయాలని భావిస్తున్నారట సుక్కు. ఇప్పటినుంచి కాస్త తొందర పడితేనే త్వరలో ప్రేక్షకుల ముందుకు రాగలం అని యూనిట్ మొత్తానికి కొన్ని సూచనలిచ్చారట సుకుమార్. ఆ గైడెన్స్ మేరకు పరుగు పరుగున షూటింగ్ ఫినిష్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారట. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ నిర్మిస్తున్నారు. అల్లు అర్జున్, రష్మిక మందన హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. చిత్రంలో లారీ డ్రైవర్‌ పుష్పరాజ్ రోల్‌లో బన్నీ డిఫరెంట్ గెటప్‌లో అలరించనుండగా.. పల్లెటూరు పిల్లలా డిఫెరెంట్ క్యారెక్టర్ పోషిస్తోంది రష్మిక. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ పోస్టర్స్ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేశాయి. అల్లు అర్జున్ కెరీర్‌లో మొట్టమొదటి ప్యాన్ ఇండియా మూవీగా 'పుష్ప' సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండటం విశేషం. తెలుగుతో పాటు మరో నాలుగు‌ భాషల్లో ఈ సినిమాను రూపొందిస్తున్న సుకుమార్.. చిత్రంలో కమర్షియల్ అంశాలు మెండుగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. తనదైన స్టైల్‌లో ఐటెం సాంగ్ కూడా షూట్ చేస్తున్నారట. ఏదిఏమైనా 'పుష్ప' కోసం బన్నీ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: