టాలీవుడ్ నుంచి వచ్చిన బాహుబలి సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.. పలు భాషల్లో విడుదల అయిన ఈ సినిమా ని దేశంఅంతటా ప్రజలు ఆదరించారు.. ఈ సినిమా తర్వాత దేశమంతటా పేరు సంపాదించుకున్న సినిమా కేజీఎఫ్..కన్నడ నుంచి ఎలాంటి  అంచనాలు లేకుండా వచ్చిఒక్కసారిగా దేశాన్ని ఊపేసింది అని చెప్పొచ్చు.. ఈ సినిమా తో యష్ కూడా ప్రభాస్ లాగే దేశమంతటా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.. మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో సెకండ్ పార్ట్ పై అంచనాలు డబుల్ అయ్యాయి.. పైగా ఈ సినిమా లో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నటిస్తుండడంతో మొదటి పార్ట్ కంటే ఎక్కువగా ప్రేక్షకులు సెకండ్ పార్ట్ కోసం ఎదురు చూస్తున్నారు..

2021 సంక్రాంతికి ఈ సినిమా ని రిలీజ్ చేయాలనీ చూస్తుండగా  కరోనా వల్ల ఆగిపోయిన కేజీఎఫ్ సినిమా షూటింగ్ ఇపుడు మొదలయిపోయింది.  మొన్నటి నుంచి బాలన్స్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు యష్. పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ ఉన్న క్రేజ్ ఉన్న కెజిఎఫ్ 2 లాంటి సినిమాలు వస్తేనే జనాలు ధియేటలకు వస్తారని సినిమా ని కొన్ని రిపైర్లు చేస్తున్నారట.. ఈ సినిమా లో విలన్ గా నటిస్తున్న సంజయ్ దత్ త్వరలోనే షూటింగ్ లో పాల్గొంటున్నాడట..అయితే  తన కోసమే కెజిఎఫ్ టీమ్ కొన్ని కీలక మార్పులు చేస్తోందని తెలుస్తుంది.

ముందు రాసుకున్న స్క్రిప్ట్ ప్రకారం కాకుండా సంజయ్ దత్ కి ఎక్కువ రిస్క్ లేకుండా యాక్షన్ ఎపిసోడ్లలో కొన్ని రిపేర్లు చేస్తున్నట్టు బెంగుళూరు టాక్.  సంజయ్ దత్ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని రిస్క్ అనిపించే షాట్స్ లేకుండా జాగ్రత్త పడుతున్నారట. ఒకవేళ తప్పదు అనుకున్న చోట డూప్ ని వాడి విజువల్ ఎఫెక్ట్స్ సహాయంతో మేనేజ్ చేయాలనీ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిసింది.  ఇక ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న కెజిఎఫ్ 2లో  సీనియర్ హీరోయిన్ రవీనాటాండన్ ప్రధాని ఇందిరా గాంధీని పోలిన పాత్రలో కనిపించనుంది. ప్రకాష్ రాజ్, రావు రమేష్ లాంటి కొత్త క్యాస్టింగ్ కూడా సీక్వెల్ లో తోడయ్యింది. త్వరలోనే టీజర్ వస్తుందని అభిమానులు ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: