టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ప్రస్తుతం మంచి పేరు క్రేజ్ తో కొనసాగుతున్న స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ఇటీవల నిశ్శబ్దం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. నాగార్జున హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ సినిమా ద్వారా టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అనుష్క శెట్టి, ఆ తరువాత మహానంది, విక్రమార్కుడు, లక్ష్యం, కింగ్, అరుంధతి వంటి సినిమాలతో విజయాలు అందుకున్నారు.

కాగా వాటిలో లేడీ ఓరియెంటెడ్ సినిమాగా తెరకెక్కిన అరుంధతి అతి పెద్ద విజయాన్ని అందుకుని హీరోయిన్ గా అనుష్క కు విపరీతమైన క్రేజ్ ని తెచ్చిపెట్టింది. ఇక ఇటీవల రాజమౌళి తీసిన బాహుబలి సిరీస్ లోని రెండు సినిమాలతో భారీ విజయాలు అందుకుని కెరీర్ పరంగా మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరిన అనుష్క, ఆపై నటించిన భాగమతి సినిమా ద్వారా భారీ సక్సెస్ ని అందుకుంది. అయితే ఎన్నో ఆశలతో ఆమె నటించిన నిశ్శబ్దం సినిమా మాత్రం ఆశించిన రేంజ్ సక్సెస్ ని అయితే అందుకోలేదు. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఇటీవల అమెజాన్ ప్రైమ్ ఓటిటి లో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఇకపోతే అతి త్వరలో మరొక భారీ సినిమాలో అనుష్క నటించనున్నట్లు తెలుస్తోంది.

అరుంధతి మాదిరిగా సోషియో ఫాంటసి చిత్రంగా రూపొందనున్న ఆ సినిమాలో ఆమె పాత్ర చుట్టూనే సినిమా మొత్తం తిరుగుతూ ఉంటుందని, తప్పకుండా తనకు కెరీర్ పరంగా ఈ సినిమా మంచి జోష్ ని ఇస్తుందని అనుష్క ఆశిస్తోందట. ఒక టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ ఎంతో గ్రాండ్ లెవెల్లో నిర్మించనున్న ఈ సినిమాకు ఒక యువ దర్శకడు దర్శకత్వం వహించనుండగా దీనికి సంబంధించి అతి త్వరలో అధికారికంగా ప్రకటన కూడా రానున్నట్లు చెప్తున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే మాత్రం ఇది తప్పకుండా అనుష్క ఫ్యాన్స్ కు పెద్ద పండుగ వార్త అని చెప్పకతప్పదు....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: