తనకు ఎంతో ఇష్టమైన సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేసే అవకాశం రావడంతో పరశురామ్ పెట్ల ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. 14 రీల్స్ ప్లస్, మైత్రి మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు కలిసి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఈ సినిమాలో మహేష్ బాబు క్యారెక్టర్ అదిరిపోతుందని సమాచారం. బ్యాంక్ మోసాలు కుంభకోణాల నేపథ్యంలో మంచి మెసేజ్ తో పాటు పలు కమర్షియల్ హంగులు కలగలిపి దర్శకుడు పరశురామ్ ఈ సినిమాని తీయనున్నాడని, అలానే తొలిసారిగా మహేష్ బాబుకు జోడిగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

ఇప్పటికే మహేష్ బాబు జన్మదినం సందర్భంగా రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కు అభిమానుల నుండి విపరీతమైన రెస్పాన్స్ లభించింది. ఇక అతి త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అమెరికాలో ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ ని నవంబర్ మొదటి వారంలో అమెరికాలో ప్రారంభిద్దామని అనుకున్నారు మూవీ యూనిట్. అయితే ప్రస్తుతం అక్కడ కరోనా కేసులు మరింతగా పెరుగుతూ ఉండడంతో, అందుతున్న సమాచారం ప్రకారం జనవరిలో సర్కారు వారి పాట యూనిట్ అమెరికా వెళ్లి అక్కడ చిత్రీకరణ ప్రారంభించనుందని చెబుతున్నారు.

అయితే సినిమా షూటింగ్ ఆలస్యం అయినప్పటికీ కూడా కథ, స్క్రిప్టు పరంగా ఎంతో నమ్మకంగా ఉన్న దర్శకుడు పరశురామ్, తప్పనిసరిగా సూపర్ స్టార్ తో చేస్తున్న ఈ సినిమా లేట్ అయినప్పటికీ కూడా అద్భుతమైన విజయాన్ని అందుకునేలా తెరకెక్కించనున్నాడని అంటున్నారు. ఇక ఇప్పటికే మరోవైపు భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు సినిమాలతో వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్న సూపర్ స్టార్ ఖాతాలో సర్కారు వారి పాట రూపంలో మరో విజయం చేరడం ఖాయమని అంటున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: