అల వైకుంఠపురములో తర్వాత త్రివిక్రం ఏ సినిమా చేస్తాడా అన్న క్లారిటీ ఇంకా రాలేదు. అసలైతే ఎన్.టి.ఆర్ తో సినిమా దాదాపు కన్ ఫాం అవగా ఆర్.ఆర్.ఆర్ షెడ్యూల్ అనుకున్న విధంగా పూర్తి అయ్యేలా లేదని మరో హీరోతో సినిమా చేయాలని చూస్తున్నాడు త్రివిక్రం. అయితే ఈమధ్య మహేష్ ఖలేజా 10 ఇయర్స్ అయిన సందర్భంగా చేసిన మెసేజ్ చూసి త్రివిక్రం లైన్ లో మహేష్ కూడా ఉన్నాడని అనుకున్నారు.

సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత మహేష్ తన నెక్స్ట్ త్రివిక్రం తో చేస్తాడని అంటున్నారు. అతడు, ఖలేజా తర్వాత త్రివిక్రం, మహేష్ కాంబోలో వచ్చే సినిమా గురించి సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఎక్సయిటింగ్ గా ఉన్నారు. ఇదిలాఉంటే త్రివిక్రం ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో ఓ సినిమా ప్లానింగ్ లో ఉన్నాడని లేటెస్ట్ టాక్.

రామ్ రెడ్ సినిమా రిలీజ్ కు రెడీ అయ్యింది. తర్వాత సినిమా ఏంటన్నది ఇంకా ఫిక్స్ అవలేదు. ఈ గ్యాప్ లో త్రివిక్రం తో రామ్ సినిమా సెట్ చేస్తున్నారట స్రవంతి రవికిశోర్. మొత్తానికి రామ్, మహేష్, ఎన్.టి.ఆర్ ఈ ముగ్గురిలో త్రివిక్రం ఎవరితో సినిమా చేస్తాడు అన్నది ఇంకా క్లారిటీ రాలేదు. త్రివిక్రం ఎవరితో చేసినా ఆయన మార్క్ ఉంటుంది. మరి ఈ ముగ్గురిలో ఎవరితో మాటల మాంత్రికుడి సినిమా ఉంటుందో చూడాలి.                                                                                    

మరింత సమాచారం తెలుసుకోండి: