భద్రాచలం, మారేడుమిల్లి, రంపచోడవరం అడవుల్లో ఈ సినిమా షూటింగ్ లొకేషన్స్ ఫిక్స్ చేశారట. అక్కడ ఉన్న ఉడ్ రిసార్ట్స్ అన్ని సినిమా యూనిట్ కోసం బుక్ చేసినట్టు తెలుస్తుంది. ముందు కేరళ అడవుల్లో షూటింగ్ అనుకున్న సుకుమార్ అక్కడ కొంత పార్ట్ షూటింగ్ కూడా చేశాడు. అయితే కరోనా వల్ల లెక్కలన్ని మారిపోయాయి. ఈ సినిమాను అనుకున్న విధంగా నవంబర్ ఫస్ట్ వీక్ నుండి సెట్స్ మీదకు వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు.
కేరళ, ఆదిలాబాద్, వికారాబాద్ ఇలా ఫారెస్ట్ జోన్ లన్నిటిని పరిశీలించి ఖమ్మం, చత్తీస్ గడ్ సరిహద్దుల్లో షూటింగ్ కు ఎలాంటి ఇబ్బంది ఉండదని చిత్రయూనిట్ అలా ఫిక్స్ అయ్యారట. త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చేస్తారని తెలుస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. పుష్ప సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. పుష్ప సినిమా బన్నీ కెరియర్ లో స్పెషల్ మూవీ కానుందని చెప్పొచ్చు. అల వైకుంఠపురములో సినిమాతో రికార్డులు కొట్టిన బన్నీ ఈ సినిమాతో నేషనల్ వైడ్ గా తన సత్తా చాటాలని చూస్తున్నాడు.