బాబాయ్ వెంకటేష్ కారణంగా ఇప్పుడో పెద్ద సినిమాలోనుంచి రానా తప్పుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అన్నీ అనుకున్నట్టు జరిగితే రానా త్వరలోనే అయ్యప్పన్ కోషియమ్ రీమేక్ కి హాజరవుతారని, ఏమాత్రం తేడా కొట్టినా ఆ సినిమా మిస్ అవుతారని అంటున్నారు. అయ్యప్పన్ కోషియమ్ రీమేక్ లో ఇద్దరు హీరోలు ఉండాలి. ఒక హీరోగా రానా ముందే ఫిక్స్ అయ్యారు. అయితే రెండో పాత్రపైనే చాన్నాళ్లనుంచి సందిగ్ధం నెలకొంది. మొదట్లో బాలయ్యని అనుకున్నారు, ఆ తర్వాత రవితేజని కూడా అనుకున్నారు. చివరకు పవన్ కల్యాణ్ దగ్గరకు వెళ్లింది ఈ ప్రాజెక్ట్.

అయితే పవన్ కల్యాణ్ ఫిక్స్ అయిన తర్వాత రానాని మారుస్తారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. దీనికి ఓ నెగెటివ్ సెంటిమెంట్ కూడా అడ్డుపడుతోందని అంటున్నారు. గతంలో పవన్ కల్యాణ్, వెంకటేష్.. గోపాల గోపాల సినిమాలో కలసి నటించారు. ఆ సినిమా అనుకున్నంతగా ఆడలేదు. అప్పటినుంచి పవన్ కల్యాణ్ కు మల్టీస్టారర్ మూవీలంటే కాస్త కష్టంగానే ఉంది. అయితే అయ్యప్పన్ కోషియమ్ కథ బాగుండటంతో రీమేక్ కి పవన్ ఒప్పుకున్నారు.
అయితే అప్పుడు వెంకటేష్ తో ఫ్లాప్ వచ్చింది కాబట్టి, ఇప్పుడు రానాతో కూడా అదే సెంటిమెంట్ రిపీట్ అవుతుందని అనుకుంటున్నారు. దీంతో రానాని ఈ పాత్రనుంచి తప్పించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అయితే పృథ్వీరాజ్ క్యారెక్టర్ కి రానా కి ఆల్టర్నేట్ ఎవరు దొరుకుతారా అని చిత్ర బృందం ఎదురు చూస్తోంది. ఈ దశలో రానాకి ఆల్టర్నేట్ వెదికే కంటే.. ఆయన్నే ఫిక్స్ చేయాలనే వాదన కూడా వినిపిస్తోంది. అయితే పవన్ కి ఉన్న నెగెటివ్ సెంటిమెంట్ ప్రకారం రానాని కచ్చితంగా తప్పిస్తారని అంటున్నారు. చివరిగా చిత్ర బృందం నుంచి ప్రకటన విడుదలయితే కానీ అయ్యప్పన్ కోషియమ్ లో సెకండ్ హీరో ఎవరనే విషయం తేలుతుంది. పవన్ కి టీజర్ విడుదల చేసినట్టే.. సెకండ్ హీరోకి సంబంధించి కూడా త్వరలో నిర్మాణ సంస్థ మరో టీజర్ విడుదల చేయాలనుకుంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: