టెలివిజన్ పరిశ్రమలో మంచి రేటింగ్స్ తో దూసుకుపోతున్న అతిపెద్ద రియాలిటీ షోలలో బిగ్ బాస్ ఒకటి. ప్రస్తుతానికి బిగ్ బాస్ సీజన్ 4 చాలా ఆసక్తికరంగా నడుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 4 లో హోస్ట్ అవతారం ఎత్తిన సమంత దాదాపు 3.30 గంటలపాటు నాన్ స్టాప్ ఎంటర్ టైన్మెంట్ ఇచ్చింది. ఒక పక్కన హౌస్ మేట్స్ ని డీల్ చేస్తూనే సెలబ్రిటీలని పరిచయం చేస్తూ ఆమె రచ్చ చేసింది. మనాలిలో తన వైల్డ్ డాగ్ సినిమా షూటింగ్ కారణంగా, కింగ్ నాగ్ వెళ్ళగా మొన్న విజయదశమి స్పెషల్ ఎపిసోడ్ కోసం బిగ్ బాస్ తెలుగు 4 కి హోస్ట్‌గా అక్కినేని సమంతను పంపారు.

అయితే సమంతా హోస్టింగ్ నైపుణ్యాలను మెజారిటీ ప్రశంసించగా చాలా మంది ఆమె అంత బెటర్ ఏమీ కాదని కూడా అంటున్నారు. తాజాగా అదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు బిగ్ బాస్ సీజన్ 2 విజేత కౌషల్. కౌషల్ తాజాగా ఓ జాతీయ పత్రికతో మాట్లాడుటూ సమంతా తన చిరునవ్వుతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిందని అన్నారు. సమంతా తన చిరునవ్వుతో మరియు ఆత్మవిశ్వాసంతో అందరినీ ఆకట్టుకుందన్న ఆయన అయితే, ఈ ప్రదర్శనని ఆమె కంటే బెటర్ గా రమ్యకృష్ణ లేదా రోజాలు ఇంకా బాగా చేయగలరని అన్నాడు.

 సమంతా యువ ప్రేక్షకులతో మంచి బాండింగ్ కలిగి ఉన్నారనేది కాదనలేని వాస్తవం, అని అది ఓటింగ్‌ కి సహాయపడుతుందని అన్నారు. మేకర్స్ ఒక హోస్ట్ ని ఎంపిక చేయడం వెనుక చాలా కారణాలు ఉంటాయి అని. హోస్ట్ ఎల్లప్పుడూ పోటీదారుల తప్పులు ఎత్తి చూపడమే కాదు. ఇంకా చాలా చేయాలని ఆయన అన్నారు. నాగార్జున అప్పుడప్పుడు ప్రజల అభిప్రాయాలని లోపల ఉన్నవారికి చెప్పడం ద్వారా అది పోటీదారుల మనోధైర్యాన్ని పెంచుతుందని కౌషల్ అభిప్రాయపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: