దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమాలతో ప్రభాస్ ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఆ సినిమా ఇచ్చిన ఉత్సహంతో మరో పాన్ ఇండియా మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి, సుజిత్ దర్శకత్వంలో సాహో సినిమా చేసాడు. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. కానీ కలెక్షన్ల పరంగా పర్వాలేదు అనిపించింది. దానితో ఇప్పుడు ప్రభాస్ తన తదుపరి సినిమాలన్నీ పాన్ ఇండియా లెవెల్ లొనే చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ప్రభాస్, జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో రాదే శ్యామ్ సినిమా సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ తో పూజా హెగ్డే రొమాన్స్ చేయనుంది.1920 ల కాలంలో ఇటలీలో సాగే ప్రేమ కథగా ఈ సినిమా రూపొందుతుంది.

 కరోనా వైరస్ నేపథ్యంలో చిత్ర షూటింగ్ కు బ్రేక్ పడగా..తాజాగా కరోనా ఉదృతి కాస్త తగ్గుముఖం పట్టడం తో మళ్లీ సినిమా షూటింగ్ మొదలు పెట్టారు.ప్రస్తుతం చిత్ర యూనిట్ ఇటలీ లో ఉంది. చిత్రంలోని కీలక సన్నివేశాలను ఇక్కడ షూట్ చేస్తున్నారు. వీరు యమ స్పీడ్ గా పని కానిచ్చేస్తున్నారు . ఇప్పటికే అక్కడ కొన్ని కీలక ప్రదేశాల్లో షూట్ జరుగుతున్న ఆన్ లొకేషన్ ఫొటోస్ మరియు షూట్ వీడియోస్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇటీవలే ఇటలీ వీధుల్లో చిన్నారులతో ప్రభాస్‌ ఉన్న పిక్స్‌ సోషల్‌ మీడియాలో ఎంత వైరల్‌ అయ్యాయో అందరికి తెలిసిందే.అయితే ప్రస్తుతం ఇటలీలో కరోనా వ్యాప్తి ఉన్న నేపథ్యంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ చిత్రీకరణ జరుపుతున్నారు.

ఇకతాజాగా, రాధేశ్యామ్ షూటింగ్ లొకేషన్లలో ప్రభాస్, బాలీవుడ్ లేడీ కొరియోగ్రాఫర్ వైభవి మర్చంట్ తో దిగిన సెల్ఫీలు ఇంటర్నెట్లో సందడి చేస్తున్నాయి. షూటింగ్ విరామాల్లో సరదాగా గడుపుతున్న ప్రభాస్. వైభవి మర్చంట్ తో ఇటలీ వీధుల్లో హాయిగా ఆస్వాదిస్తున్నాడు. సెట్స్ పైకి అడుగుపెట్టిన సందర్భంగా వైభవి ఓ అందమైన పుష్పగుచ్ఛాన్ని ప్రభాస్ కు అందించింది.ప్రస్తుతం ప్రభాస్ తో సెల్ఫీ దిగిన ఈ అమ్మాయి ఎవరా అని తెగ ఆలోచిస్తున్నారు అభిమానులు. అందుకే ఈ ఫోటో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారింది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: