తెలుగు చిత్ర పరిశ్రమలో అనుష్క గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన అంద చెందాలతో కోట్లాది మంది తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. తెలుగు చిత్ర పరిశ్రమలో సూపర్ సినిమాతో తెరంగ్రేటం చేసిన అనుష్క ఆ తర్వాత వరస సినిమాలు చేసుకుంటూ టాప్ హీరోల సరసన కూడా నటించింది. సౌత్ ఇండియ‌న్ నెంబ‌ర్ వ‌న్ హీరోయిన్‌గా కొన్నేళ్ల పాటు చ‌క్రం తిప్పిన అనుష్క.

ఇక అరుంధతి, బాహుబలి, రుద్రమదేవి, భాగమతి లాంటి సినిమాలు అనుష్కకి మంచి పేరుని తీసుకొచ్చాయి. అయితే భాగమతి’ తర్వాత అనుష్క కొంత కాలం కనిపించకుండా పోయింది. గ్యాప్ తీసుకుని ‘నిశ్శబ్దం’ సినిమాలో నటించింది. దీని తర్వాత మరే చిత్రానికీ కమిట్మెంట్ ఇచ్చినట్లు అధికారిక సమాచారం అయితే బయటికి రాలేదు. అయితే నిశ్శబ్దం సినిమా ఓటిటిలో రిలీజ్ అయినా సంగతి అందరికి తెలిసిందే. అయితే ఈ సినిమా అనుకుంతాగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.

అయితే సినిమాను వ్యాపార కోణంతో తాను ఎన్నడూ చూడనని అంటోంది అనుష్క. ఆన్‌స్క్రీన్‌ మ్యాజిక్‌ను, సంతోషాన్ని ప్రతిక్షణం ఆస్వాదించడానికే ప్రయత్నిస్తానని అంటోంది.‘సూపర్‌ సినిమాతో కథానాయికగా అరంగేట్రం చేసిన అనుష్క చిత్రసీమలో అడుగుపెట్టి పదిహేనేళ్లు పూర్తయ్యాయి. ఈ ప్రయాణంలో ప్లాన్‌ చేస్తూ తానెప్పుడూ సినిమాలు చేయలేదని తెలిపింది. మనసు చెప్పిన మాటలకు కట్టుబడుతూ ముందుకుసాగానని తెలిపింది.

ఈ సందర్బంగా అనుష్క మాట్లాడుతూ.. ‘వ్యాపార కోణంలో ఆలోచించి ఇప్పటివరకు సినిమాల్ని అంగీకరించలేదు. ఆ లెక్కలు నాకు తెలియవు. నా కెరీర్‌కు ఎంత ఉపయోగపడుతుంది? పేరుప్రఖ్యాతలు తీసుకొస్తుందా?లేదా? అనేవి పట్టించుకోను. నా మనసుకు నచ్చితే చాలనుకుంటాను. అంతకుమించి ఏదీ కోరుకోను. ఎలాంటి ప్రణాళికలు వేసుకోకుండా సినిమాల్లో నటిస్తుంటా.  ఆ ఆలోచనా విధానమే  నాకు విజయాల్ని తెచ్చిపెట్టింది. డబ్బు, స్టార్‌డమ్‌ ఇవ్వలేని సంతృప్తి, ఆనందాన్ని  ఈ సక్సెస్‌లతో పొందగలిగా’ అని తెలియజేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: