బాహుబలి ఫ్రాంచైజ్ దెబ్బకి ప్రభాస్ క్రేజ్ ఖండాంతరాలు దాటిపోయిందని చెప్పచ్చు. జపాన్, ఆఫ్రికా, చైనా వంటి దేశాల్లో సైతం ఆయనకు ఫ్యాన్స్ ఏర్పడ్డారు. ఆ క్రేజ్ తోనే సాహో లాంటి భారీ బడ్జెట్ సినిమాని ప్లాన్ చేసి రిలీజ్ చేశారు. ఈ సినిమా బాలీవుడ్ లో కలెక్షన్స్ బాగా తెచ్చుకుంది. కానీ మిగతా సౌత్ బాషలలో రిలీజ్ అయినా పెద్దగా జనానికి ఎక్కలేదు. ఇప్పుడు అయన ఎలా అయిన హిట్ కొట్టాలని జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో రాధే శ్యామ్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా మీద కూడా అంచనాలు బాగానే ఉన్నాయి. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమా అనౌన్స్ చేశారు. మహా నటితో  పాపులర్ అయిన నాగ్ అశ్విన్ డైరెక్షన్‌ లో రానున్న ఆ సినిమాని వైజయంతీ మూవీస్ సంస్థ నిర్మించనుంది.

ఈ సినిమాలో దీపికా నటించనున్నట్టు అధికారిక ప్రకటన కూడా మొన్నీ మధ్య విడుదలైంది. తాజాగా మరో ప్యాన్ ఇండియన్ మూవీ కూడా అనౌన్స్ చేశాడు ప్రభాస్. ఆదిపురుష్ పేరిట తెరకెక్కనున్న ఈ సినిమాని తానాజీ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించనున్నారు. ఇదంతా బాగానే ఉన్నా ప్రభాస్ రాధేశ్యామ్ విషయంలోనే అనేక సవాళ్ళు ఎదురవుతున్నాయి. నిజానికి ఈ సినిమా షూట్ కోసం క‌రోరాకు ముందు జార్జియా వెళ్లారు. అక్క‌డ‌ కీల‌క ఘ‌ట్టాల‌ని చిత్రీక‌రించాల‌ని ప్లాన్ చేశారు.

కొంత వ‌ర‌కు షూటింగ్ జ‌రిగినా అక్కడ క‌రోనా టెన్షన్ పెట్టడంతో వెనక్కు రావాల్సి వ‌చ్చింది. అయితే ఈ టీమ్ మళ్ళీ మొన్ననే ఇట‌లీ వెళ్లింది. అసంపూర్తిగా ఆపేసిన స‌న్నివేశాల్ని మళ్ళీ షూట్ చేయడం మొద‌లుపెట్టింది. ఓ వారం షూటింగ్ కూడా పూర్త‌యింది. ఇప్పుడు మళ్ళీ ఇట‌లీలో క‌రోనా కేసులు మ‌ళ్లీ ప్ర‌బ‌లుతుండ‌టంతో అక్క‌డి ప్ర‌భుత్వం క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకుంటోంది. ఇప్పటకే ప‌బ్లిక్ స్లేస్‌ల‌లో బాగా క‌ఠిన నిబంధ‌న‌ల్ని అమలు చేస్తున్నారు. దీంతో మళ్ళీ ఈ టీమ్ కి ఇబ్బందులు ఎదురయ్యాయి అని అంటున్నారు. మళ్ళీ వెనక్కు రాక తప్పదని అంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: