బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో ఎనిమిదవ వారం ఇపుడు సాగుతోంది. సినీ పరిభాషలో చెప్పాలంటే బిగ్ బాస్ షో అర్ధ శతదినోత్సవం విజయవంతంగా పూర్తి చేసుకుంది. శత దినోత్సవం వైపు పరుగులు తీస్తోంది. మొత్తం 19 మంది కంటెస్టెంట్లు హౌజ్ లో కి వస్తే వారిలో ఇపుడు మిగిలింది 11 మంది మాత్రమే. ఇందులో ఆరుగురు ఈసారి నామినేషన్లలో ఉన్నారు. వీరిలో ముగ్గురు డేంజర్ జోన్ లోకి వచ్చేశారు. దాంతో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది బుర్ర బద్దలు కోవాల్సివస్తోంది.

ఈ వారం ఆరియానా, అఖిల్, అమ్మ రాజశేఖర్, లాస్య, మెహబూబ్, మోనాల్ గజ్జర్ నామినేషన్లలో ఉన్నారు. వీరిలో మోనాల్, అమ్మ రాజశేఖర్ తో పాటు అఖిల్ కూడా ఇపుడు డేంజర్ జోన్ లోకి వచ్చేశాడు అంటున్నారు. అఖిల్ టాస్క్ లు చేస్తున్నా గేమ్ ఆడుతున్నా ఎందుకో మునుపటిలా లేడు, బాగా  డల్ అయ్యాడు. అతను మోనాల్ వైపు ఉండడంతో ఆడియన్స్ కూడా అతని మీద నెగిటివిటీ పెంచుకుంటున్నారట.

దాంతో మోనాల్ కంటే ముందే అఖిల్ ని హౌజ్ లో నుంచి పంపాలని అనుకుంటున్నారుట. అఖిల్ మోనాల్ తో ఎక్కువగా గడపడంతో పాటు టాస్కుల విషయంలో ఈ మధ్య ఇంటెరెస్ట్ చూపకపోవడం అతనికి ఇబ్బందిగా మారిందని అంటున్నారు. దీంతో ఈ వారం అఖిల్ జాతకం ఏంటన్నది కూడా తేలుతుంది అంటున్నారు.

ఇదిలా ఉంటే అమ్మ రాజశేఖర్ డేంజర్ జోన్ లో మొదట ఉండే కంటెస్టెంట్ అని అంతా అంటున్నారు. నిజానికి గత వారం అమ్మ రాజశేఖర్ కనుక నామినేషన్లలో ఉంటే దివి ఎలిమినేట్ అయ్యేది కాదని కూడా చెబుతున్నారు. దాంతో తరువాత వంతు ఆయనదేనని గట్టిగా చెప్పేస్తున్నరు. అదే విధంగా మోనాల్ గజ్జర్, ఆమె మీద గత కొన్ని వారాలుగా ఆడియన్స్ గురి పెట్టి ఉన్నారట. ఆమె ఏడుపు తప్ప ఎంటర్ టైన్మెంట్ లేదని ఎలా హౌజ్ లో కొనసాగిస్తున్నారని డౌట్లు వస్తున్నాయట. మొత్తానికి ఈ ముగ్గురూ ఇంచుమించుగా ఎవరూ ఎక్కువ కాకుండా డేంజర్ జోన్ లోనే ఉన్నారని చెబుతున్నారు. మరి వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నదే బిగ్ బాంబ్ లాంటి ప్రశ్న.


మరింత సమాచారం తెలుసుకోండి: