పవన్ కళ్యాణ్ ‘అయ్యప్పన్ కోషియమ్’ మూవీ రీమేక్ లో నటించడానికి ఒప్పుకోవడానికి సంబంధించిన న్యూస్ షాక్ నుండి ఇప్పటివరకు ఇండస్ట్రీ వర్గాలు తేరుకోలేక పోతున్నాయి. ‘అప్పట్లో ఒకడుండేవాడు’ ఫేమ్ సాగర్ చంద్ర దర్శకత్వంలో పవన్ ఈసినిమా చేయబోతు ఉండటం ఒక సంచలనంగా మారింది. ఏమాత్రం అనుభవం లేని ఒక యంగ్ డైరెక్టర్ ని పవన్ నమ్మడం చాలామందిని ఆశ్చర్య పరుస్తోంది.


ఇందులో పవన్ కళ్యాణ్ మళయాళంలో ‘బిజు మీనన్’ చేసిన పోలీస్ పాత్రలో కనిపించబోతూ ఉంటే పృథ్వీరాజ్ చేసిన ఎక్స్ మిలిటరీ మ్యాన్ క్యారెక్టర్ను రానా తో చేయిద్దామని గట్టి ప్రయత్నాలు చేసారు. అయితే ఎందుకనో రానా ఈమూవీ పై పెద్దగా ఆశక్తి కనపరచడం లేదు అన్న గాసిప్పులు వస్తున్నాయి. మళయాళంలో మీడియం బడ్జెట్ తో తీసిన ఈ రీమేక్ ఇప్పుడు తెలుగులో భారీ బడ్జెట్ మూవీగా మారిపోయింది.



దీనితో ఈ మల్టీ స్టారర్ లో పవన్ కు అన్నివిధాలా సరిపోయే మరో హీరో గురించి అన్వేషణ జరుగుతోంది. మూవీ మార్కెట్ పరంగా కూడ ఈ మూవీలో పవన్ రేంజ్ కి సరిపడే మరొక హీరో ఉంటే ఈమూవీకి మార్కెటింగ్ సమస్యలు ఉండవు అని ఈమూవీ నిర్మాణ సంస్థ భావిస్తున్నట్లు టాక్.


అయితే పవన్ మూడ్స్ ఏ క్షణాన ఎలా ఉంటాయో తెలియవు కాబట్టి పవన్ తీరుకు తగ్గట్టుగా సహకరించగల ఒక టాప్ హీరో ఈమూవీలో కోషి పాత్రలో నటింప చేయగలిగితే బాగుంటుంది అని ఈమూవీ నిర్మాతలు భావిస్తున్నా కోషీ పాత్రకు సరైన నటుడు దొరకడం కష్టంగా మారింది అని అంటున్నారు. ‘వకీల్ సాబ్’ షూటింగ్ పూర్తి అవ్వగానే ఈమూవీ సెట్స్ పైకి వచ్చేస్తాను అని పవన్ చెపుతున్న మాటలు అమలులోకి వస్తే సంక్రాంతికి ‘వకీల్ సాబ్’ సమ్మర్ రేస్ కు అయ్యప్పన్ కోషియమ్’ అదే సంవత్సరం చివరిలో క్రిష్ ‘విరూపాక్ష’ రాగలిగితే ఒకే సంవత్సరంలో మూడు సినిమాలను చేసిన టాప్ హీరోగా పవన్ రికార్డు క్రియేట్ చేయగలుగుతాడు..


మరింత సమాచారం తెలుసుకోండి: