బాలక్రిష్ణ టాలీవుడ్ టాప్ స్టార్. ఆయన సినీ జీవితం నాలుగున్నర దశాబ్దాలు. బాలయ్య ఒక్క తెలుగులోనే నటించారు ఇప్పటిదాకా. సాటి హీరోలు చిరంజీవి వెంకటేష్, నాగార్జున అప్పట్లోనే  హిందీ సినిమాలు చేసినా కూడా బాలయ్య మాత్రం తెలుగుకే పరిమితం అయిపోయారు. అయితే ఇపుడు పరిస్థితులు బాగా మారిపోయాయి. కంటెంట్ గట్టిగా ఉండి, పాన్ ఇండియా అప్పీల్ ఉంటే చాలు బొమ్మ దేశమంతా పడాల్సిందే అంటున్నారు. ఇపుడున్న సీనియర్ హీరోల్లో మెగాస్టార్ సైరా మూవీతో పాన్ ఇండియా ప్రయోగం చేశారు.

సరైన సబ్జెక్ట్ దొరకాలే కానీ నాగార్జున ఎపుడూ రెడీనే. వెంకీ కూడా అలాగే ఉంటాడు. కానీ బాలయ్యతో పాన్ ఇండియా మూవీ ఉంటుందా అన్నది పెద్ద ప్రశ్న. బాలయ్య కూడా ఎపుడూ సీరియస్ గా ఈ విషయాలు తీసుకోరు అని కూడా అంటున్నారు. కానీ ఆయన పూరీ జగన్నాధ్ తో కలసి చేసే మూవీ కచ్చితంగా పాన్ ఇండియా లెవెల్లోనే ఉంటుందని అంటున్నారు.

పూరీ ఇప్పటికే విజయ్ దేవరకొండతో కలసి ఫైటర్ మూవీని పాన్ ఇండియా లెవెల్లో తీస్తున్నాడు. ఈ మూవీ తరువాత పూరీ తన పాన్ ఇండియా ఇమేజ్ ని తగ్గించుకుంటాడా అన్నదే డౌట్. ఆయన బాలయ్యతో తరువాత  సినిమా చేస్తాడు అని అంటున్నారు. మరి బాలయ్యతో మూవీ అంటే రీజనల్ లెవెల్లో తీస్తారా అన్నది చర్చగా ఉంది. ఒకసారి పాన్ ఇండియా లెవెల్ కి వెళ్లాక మళ్ళీ వెనక్కి వస్తే బాగుండదు. దాంతో బాలయ్య తో కనుక మూవీ చేస్తే కచ్చితంగా పాన్ ఇండియా సబ్జెక్ట్ నే తీసుకుని చేస్తాడని అంటున్నారు. మరి ఈ ఇద్దరి కాంబోని యమ  క్రేజీ అంటారు. కానీ ఈ సినిమాను పట్టాలెక్కించే నిర్మాత దొరకాలిగా అంటున్నారు. అది కనుక జరిగితే బాలయ్య కూడా పాన్ ఇండియా మూవీకి రెడీ అయినట్లే. మొత్తానికి అదే జరిగితే నందమూరి ఫ్యాన్స్ కి ఫుల్ జోష్ మరి.




మరింత సమాచారం తెలుసుకోండి: