త్రివిక్రమ్ ‘అజ్ఞాతవాసి’ లాంటి ఘోరమైన ఫ్లాప్ ఇచ్చినా గతంలో జూనియర్ త్రివిక్రమ్ తో ‘అరవింద సమేత’ చేసాడు. ఆమూవీతో త్రివిక్రమ్ తిరిగి ట్రాక్ లోకి వచ్చాడు. ఆ ఉత్సాహంతో తీసిన ‘అల వైకుంఠపురములో’ ఇండస్ట్రీ హిట్ గా మారడంతో త్రివిక్రమ్ వైపు చాలామంది టాప్ హీరోలు చూస్తూ ఉన్నా మళ్ళీ జూనియర్ తోనే మరో మూవీ ప్రాజెక్ట్ కు ఓకె చేసి తమ మైత్రీ బంధాన్ని మరింత బలపరుచుకున్నాడు.


అయితే కరోనా దెబ్బతో షూటింగ్ లు ఆగిపోవడంతో ‘ఆర్ ఆర్ ఆర్’ ఎప్పుడు పూర్తి అవుతుందో తెలియని పరిస్థితి. వాస్తవానికి జూనియర్ తాను మార్చి నెలాఖరుకు ‘ఆర్ ఆర్ ఆర్’ నుండి బయటకు వచ్చి వచ్చేఏడాది ఏప్రియల్ నుండి త్రివిక్రమ్ మూవీకి అందుబాటులో ఉంటానని చెపుతున్నా త్రివిక్రమ్ నమ్మలేని పరిస్థితి.


అలా అని జూనియర్ ను దూరం పెట్టుకుని మహేష్ చేస్తున్న రాయబారాలకు స్పందించి మహేష్ తో వచ్చే ఏడాది ఒక మూవీ చేయలేని స్థితి. సరిగ్గా ఈ పరిస్థితి గ్రహించి హీరో రామ్ ఈమధ్య త్రివిక్రమ్ ను కలిసి తనతో ఒక మూవీ చేయమని కోరినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు కేవలం టాప్ హీరోలతో మాత్రమే పనిచేసిన త్రివిక్రమ్ ఇప్పుడు రామ్ సూచనకు స్పందించకుండా మౌనంగా ఉన్నట్లు లీకులు వస్తున్నాయి.


దీనికితోడు త్రివిక్రమ్ దగ్గర మహేష్ రామ్ లకు నప్పే కథలు ఏమి లేవని తెలుస్తోంది. దీనితో జూనియర్ తో తాను తీయాలనుకున్న కథకు మరిన్ని మార్పులు చేర్పులు చేస్తూ త్రివిక్రమ్ ఎలా కాలం గడపాలో తెలియని పరిస్థితులలో పవన్ కళ్యాణ్ ‘అయ్యప్పన్ కోషియన్’ కు ఓకె చేయడం త్రివిక్రమ్ కు గిఫ్ట్ గా మారింది అని అంటున్నారు. ఈసినిమా తీస్తున్నది త్రివిక్రమ్ కు అత్యంత సన్నిహితమైన హారికా హాసినీ సంస్థ కావడంతో ఈమూవీకి సంబంధించిన క్రియేటివ్ పనులను చూస్తూ మార్చి వరకు కాలం గడిపి జూనియర్ రాక కోసం ఎదురు చూసే రాజీ మార్గంలో ప్రస్తుతం త్రివిక్రమ్ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి..



మరింత సమాచారం తెలుసుకోండి: