ఏ సినిమా చేస్తాడు ఏంటి అనేది తెలియకపోయినా మలయాళంలో ఒక రీమేక్ సినిమా చేయడానికి మహేష్ బాబు రెడీ అవుతున్నాడు అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే ఒక స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆమెను మహేష్ బాబు స్వయంగా ఒప్పించారు.
మహేష్ బాబు సినిమా రీమెక్ విషయంలో కూడా ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టు సమాచారం. ఇక నమ్రత కూడా ఎక్కువగా ఫోకస్ చేసారట. ఆమె ఆ సినిమాను తెలుగులో జాగ్రత్తగా మార్చే విధంగా అయితే చేయాలని మహేష్ బాబుకి పలు సూచనలు చేశారు. మహేష్ బాబు కూడా ఒక దర్శకుడితో ఇప్పుడు చర్చలు జరుపుతున్నారని టాక్. దీనికి రెండు వారాల్లో ఒక ముందడుగు కూడా పడే అవకాశాలు ఉన్నాయి. మహేష్ బాబు నటిస్తున్న ప్రస్తుత సినిమా త్వరలోనే మొదలై వచ్చే ఏడాది ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మరి ఈ విషయంలో ఎలాంటి ముందడుగు పడుతుంది ఏంటి అనేది చూడాలి.