గత సీజన్ తో పాటు బిగ్ బాస్ సీజన్ 4 లో కూడా వ్యాఖ్యాతగా బాధ్యతలు వ్యవహరిస్తున్న అక్కినేని నాగార్జున ఈసారి కరోనా కాలంలో బిగ్ బాస్ నిర్వాహకుల అగ్రిమెంట్ మీద సంతకం చేయలేదు. గతంలో హీరో నాని అగ్రిమెంట్ మీద సంతకం చేసి చివరి వరకు హోస్ట్ గా బాధ్యతలు వ్యవహరించాల్సి వచ్చింది. కానీ ఈ సారి నాగార్జున ఎటువంటి అగ్రిమెంట్ పై సంతకం కూడా చేయలేదు. అందుకే అర్ధాంతరంగా షో ను స్వచ్ఛందంగా, స్వాతంత్రం గా వదిలి వెళ్ళిపోయారు. వైల్డ్ డాగ్ సినిమా చిత్రీకరణలో పాల్గొనాలన్న ఉద్దేశం తో అతను కులూమనాలి వెళ్ళిపోయారు.


అక్కడి నుండి మళ్ళీ తిరిగి వచ్చి షూటింగ్ లో పాల్గొని మళ్ళీ వెళ్ళి పోవడం అనేది చాలా రిస్కు తో కూడిన పని కాబట్టి తన కోడలు సమంత అక్కినేని ని ఒప్పించి షో లోకి తప్పించారు. ఆదివారం రోజు సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు ప్రసారమైన బిగ్ బాస్ సండే ఎపిసోడ్ లో సమంత అక్కినేని బుల్లితెర ప్రేక్షకులను వెండితెరకు కట్టిపడేసారు. బుల్లితెర ప్రేక్షకులు అంతా సమంత అక్కినేని ముద్దు ముద్దు మాటలను వినడానికి బాగా ఇష్టపడ్డారు అని చెప్పుకోవచ్చు. హైపర్ ఆది కూడా తనదైన శైలిలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. ఈ విధంగా నాగార్జున షూటింగ్ లో పాల్గొనడం తో షో కి దూరం అయినప్పటికీ టిఆర్పి రేటింగ్ మాత్రం బాగానే పెరిగింది.


ఆది శనివారం కూడా సమంతనే హోస్ట్ గా బాధ్యతలు వ్యవహరిస్తారని అందరూ అనుకుంటున్నారు. కానీ టీవీ వర్గాల్లో మాత్రం మరొక ప్రచారం వినిపిస్తోంది. అదేంటంటే నాగార్జున హైదరాబాద్ నగరానికి తిరిగి వచ్చేస్తున్నారని.. ఈ వీకెండ్ బిగ్ బాస్ హౌస్ లో కనిపించబోతున్నారని వార్తలు వెల్లువెత్తుతున్నాయి. నాగార్జున వస్తే ఇక సమంత అక్కినేని కనిపించకపోవచ్చు. ఆమె మూడు గంటల పాటు బాగానే హోస్టింగ్ బాధ్యతలు వ్యవహరించారు కానీ ఎలిమినేషన్స్ వంటివి చేయడం కొంచెం కష్టం కాబట్టి నాగార్జున రావాల్సి అవసరం ఉందని నిర్వాహకులు చెబుతున్నట్లు సమాచారం. ఏదేమైనా ప్రస్తుతం జోరందుకున్న ఈ ప్రచారంలో నిజమెంతో అబద్ధమెంతో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: