కరోనా తర్వాత థియేటర్స్‌ మూతబడడంతో.. చాలా చిన్న సినిమాలు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను ఆశ్రయించాయి. ఓటీటీలో రిలీజ్‌ అవుతున్నాయేగానీ.. ప్రేక్షకులకు బాగా దగ్గరైన సినిమా ఒక్కటీ పడలేదు. రీసెంట్‌గా.. దసరా సందర్భంగా ఓటీటీలో రిలీజైన ఓ చిత్రం మాత్రం.. యూత్‌తోపాటు.. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఫీల్‌ గుడ్‌ మూవీగా వచ్చిన ఆ ప్రేమకథా చిత్రం కలర్ ఫోటో.

సైలెంట్‌గా వచ్చి ప్రేక్షకుల మనసుకు దగ్గరైన చిత్రం కలర్‌ఫొటో.  గొప్పింటి అమ్మాయి..పేద అబ్బాయి అనే కథకు.. అందమైన అమ్మాయి.. నల్ల అబ్బాయి అనే కాన్సెప్ట్‌తో కలర్‌ఫొటో రూపొందింది. కమెడియన్‌ సుహాస్‌ హీరోగా పరిచయం కాగా.. చాందిని చౌదరి హీరోయిన్‌. సందీప్‌ రాజ్‌ దర్శకత్వంలో సాయి రాజేశ్‌ నీలం.. బెన్నీ ముప్పనేని ఈ చిత్రాన్ని నిర్మించారు.

కరోనా తర్వాత ఓటీటీలో చాలా సినిమాలు రిలీజ్ అయినా.. ఆడియన్స్‌ ఎక్కువగా మాట్లాడుకున్న చిత్రం మాత్రం కలర్‌ ఫొటోనే. తెలిసిన ప్రేమకథకు కొత్త దర్శకుడు సందీప్‌ రాజ్‌ అందమైన ట్రీట్‌మెంట్‌ ఇచ్చాడు. శివ శంకర్‌ ఫొటోగ్రఫీ.. కీరవాణి వారసుడు కాలభైరవ మ్యూజిక్‌... ఒకటేంటి అన్నీ కలిసి సినిమాకు పాజిటివ్‌ టాక్‌ తీసుకొచ్చాయి.

యూత్‌ఫుల్‌ మూవీ అంటే.. 90 పర్సెంట్‌ ప్రేమకథలే ఉంటాయి. వీటిలో ఇంప్రెస్‌ చేసేవి మాత్రం ఒకటీ అర మాత్రమే. ఈ జాబితాలో కలర్‌ఫొటో ఉంటుంది. సుహాస్‌ కమెడియన్‌గానే కాకుండా.. హీరోగా మెప్పించగలనని నిరూపించాడు. ఇక వైవా హర్ష కెరీర్‌లో బెస్ట్‌ పెర్‌ఫార్మెన్స్‌ మూవీగా నిలిచింది. ప్రేక్షకుల నుంచే కాకుండా.. సినిమా వర్గాల ప్రశంసలు అందుకుంటున్న కలర్‌ఫొటో ఓటీటీ ఆహాలో రిలీజ్ అయింది.

మొత్తానికి ఓటీటీలో రిలీజ్ అయిన కలర్ ఫోటో ప్రేక్షకుల ఆదరణను పొందింది. ప్రేక్షకుల మనసు దోచుకున్న తొలి ఓటీటీ చిత్రంగా సినీ ప్రేమికుల నోళ్లలో నానుతోంది. ప్రేమ కథను దర్శకుడు సందీప్ రాజ్ అద్భుతంగా చిత్రీకరించాడు. ప్రేక్షకుల తన సినిమాకు కట్టిపడేసేలా హృద్యంగా తీశాడు.











మరింత సమాచారం తెలుసుకోండి: