ఈ ఏడాది సంక్రాంతికి మహేష్ బాబు, అల్లు అర్జున్ లు పోటాపోటీగా సినిమాలు రిలీజ్ చేశారు. ఒకరు సరిలేరు నీకెవ్వరు అని ప్రేక్షకుల ముందుకు రాగా, మరొకరు అల వైకుంఠ పురంలో అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సంక్రాంతి సీజన్ ని ఈ ఇద్దరూ పంచుకుని అలరించారు. ఈ రెండు సినిమాలు తర్వాత టెలివిజన్ లో టెలికాస్ట్ చేయగా అక్కడ కూడా ఈ రెండు సినిమాలు రచ్చ చేశాయి. మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా జెమినీ వాళ్ళు కొనుక్కుని టెలికాస్ట్ చేయగా అది రికార్డులు క్రియేట్ చేసింది. అప్పటి దాక ఉన్న అన్ని  రేటింగ్ల సొంతం చేసుకుంది.

ఆ తర్వాత అల్లు అర్జున్ అల వైకుంఠ పురంలో కూడా జెమినీ టీవీలోనే టెలికాస్ట్ అయినా ఇది కూడా అన్ని టీఆర్పీ రికార్డులను బ్రేక్ చేసి కొత్త రికార్డులను నమోదు చేసింది. దీంతో ఈ ఇద్దరి సినిమాలను కొనేందుకు చానెళ్ళు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇప్పుడు మహేష్ ఏమో పరశురామ్ డైరెక్షన్ లో సర్కారు వారిపాట సినిమా చేస్తున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా అమెరికా బ్యాక్ డ్రాప్ లో జరగనుంది. ఈ సినిమా వీసా పనుల కోసం వెయిట్ చేస్తోంది యూనిట్.

మరో పక్క అల్లు అర్జున్ కూడా సుకుమార్ డైరెక్షన్ లో పుష్ప చేస్తున్నాడు. శేషాచలం అడువుల నేపధ్యంలో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపధ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. రష్మిక మంధనా హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా కూడా షూట్ పర్మిషన్స్ కోసం ఎదురు చూస్తోంది. అయితే ఇంకా షూట్ కూడా మొదలు కాని ఈ రెండు సినిమాలకి రికార్డ్ లెవల్ లో శాటిలైట్ రైట్స్ ఆఫర్ చేసినట్టు చెబుతున్నారు. దీని మీద అధికారిక ప్రకటన ఏదీ లేదు కానీ త్వరలోనే దానికి ప్రకటన వెలువడే అవకాశం ఉంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: