డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా కొనసాగుతున్నాడు. బాహుబలితో వచ్చిన క్రేజ్ అది. సాహో తెలుగులో ఫ్లాప్ అయినా బాలీవుడ్ లో మంచి కలెక్షన్లు రాబట్టింది. దీంతో ప్రభాస్ సినిమాలకు భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలు లైన్ లో పెట్టాడు. అన్నీ పాన్ ఇండియా సబ్జెక్టులే.. భారీ సినిమాలే. ఈ క్రమంలో రాధాకృష్ణ దర్వకత్వంలో తెరకెక్కుతున్న ‘రాధేశ్యామ్’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన పోస్టర్స్ తో అంచనాలు రెట్టింపయ్యాయి. ప్రస్తుతం యూరప్ లో ఉంది టీమ్.

యూరప్ నేపథ్యంలో నడిచే కథ కావడంతో అక్కడే షూటింగ్ చేయాల్సి ఉంది. అయితే.. ఇటలీలో మళ్లీ కరోనా కేసులు పెరగడం కలవరపెడుతోంది. ఈ ఏడాది ప్రారంభంలో ఇటలీని వణికించేసింది కరోనా. భారీ సంఖ్యలో మరణాలు సంభవించాయి. ఇతర దేశాల నుంచి వైద్య సిబ్బంది, వైద్య పరికరాలు, మందులు తెప్పించుకోవాల్సిన పరిస్థితి. అంతటి దారుణ పరిస్థితులు నెలకొనడంతో రాధేశ్యామ్ టీమ్ షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని వచ్చేసింది. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు చక్కబడడంతో టీమ్ యూరప్ వెళ్లి అక్కడ షూటింగ్ ప్రారంభించింది. రీసెంట్ గా ప్రభాస్ పుట్టినరోజు కూడా అక్కడే జరిగింది. ఆ పిక్స్ నెట్టింట్లో వైరల్ అయ్యాయి కూడా.

మరో పది రోజుల షెడ్యూల్ ఉందని తెలుస్తోంది. ఈలోగా యూరప్ లో మళ్లీ కరోనా కేసులు పెరుగుతూండడం కలవరపెడుతోంది. ప్రస్తుతం అక్కడ మళ్లీ కఠిన ఆంక్షలు పెట్టింది ప్రభుత్వం. ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో పలు నిషేదాజ్ఞలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాధేశ్యామ్ షూటింగ్ పై మళ్లీ ఎఫెక్ట్ పడుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతానికి దీనిపై ఎటువంటి వార్తలు లేకపోయినా ఇటలీలో పరిస్థితులు మాత్రం మళ్లీ ఆందోళన రేకెత్తిస్తోందని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: