అవునూ.. ఘట్టమనేని ఫ్యామిలీ నుండి మరో హీరో ఎంట్రీ ఇవ్వనున్నాడు. పద్మభూషణ్ సూపర్ స్టార్ కృష్ణ మరియు అత్యధిక చిత్రాలకు  దర్శకత్వం వహించిన మహిళగా గిన్నిస్ బుక్ రికార్డులకు ఎక్కిన విజయనిర్మల గారి కుటుంబం నుంచి మరో వారసుడు వస్తున్నారు. అయితే అతను ఎవరు? అతను చేస్తున్న సినిమాకు దర్శకుడు ఎవరు? అనే విషయాలు ఇపుడు మన సమీక్షలో తెలుసుకుందాం రండి..
ఇక అసలు వివరాల్లోకి వెళితే.. సూపర్ స్టార్ కృష్ణ, విజయ నిర్మల గారి మనవడు శరణ్ హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. దసరా సందర్భంగా సోమవారం ఉదయం అతని మొదటి సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. మాన్విత, కుశల కుమార్ బులేమని సమర్పణలో సినీటేరియా మీడియా వర్క్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 3గా రూపొందుతున్న ఈ సినిమా ద్వారా రామచంద్ర వట్టికూటి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
ఇదిలా ఉంటే.. యువ హీరోలు సుధీర్ బాబుగారు, నవీన్ విజయకృష్ణగారు కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ప్రముఖ నటులు డాక్టర్ వీకే నరేష్ గారు క్లాప్ ఇచ్చారు. అంతకు ముందు సుధీర్ బాబు, ప్రియా సుధీర్ బాబు దంపతుల చేతుల మీదుగా స్క్రిప్ట్ పూజా కార్యక్రమాలు జరిగాయి. వాళ్ళిద్దరూ దర్శకుడికి స్క్రిప్ట్ అందజేశారు. ముహూర్తపు సన్నివేశానికి సూపర్ స్టార్ కృష్ణగారు గౌరవ దర్శకత్వం వహించారు. ఆనంతరం సూపర్ స్టార్ కృష్ణగారు మాట్లాడుతూ.. "సినీటేరియా మీడియా వర్క్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ 3గా నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా హీరోగా పరిచయమవుతున్న, మా కుటుంబంలో సభ్యుడైన శరణ్ కి నా అభినందనలు. ఇంతకు ముందు మా కుటుంబం నుంచి వచ్చిన చాలామంది ఆర్టిస్టులను ప్రేక్షకులు ఆదరించారు. అభిమానించారు. అలాగే, శరణ్ ని కూడా ఆదరించి అభిమానించాలని కోరుకుంటున్నాను. నిర్మాతలకి, దర్శకులకి నా శుభాకాంక్షలు" అని అన్నారు. అక్కడికి వచ్చిన సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కూడా శరణ్ కి ఆల్ ది బెస్ట్ చెప్పాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: