టాలీవుడ్ హీరోయిన్ పూజ హెగ్డే పని ఇప్పుడు మూడు పూలు ఆరు కాయలు అన్నట్టుంది. ఎందుకంటే ఆమె చివరి గా నటించిన మూడు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. అందులో ఒకటి ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన అరవింద సమేత వీర రాఘవ, మరొకటి మహేష్ బాబు వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో వచ్చిన మహర్షి సినిమా. ఇక ఈ ఏడాది మొదట్లో సంక్రాంతికి అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అల వైకుంఠ పురంలో అనే సినిమాలో ఈమె  హీరోయిన్ గా నటించి బుట్ట బొమ్మ అనే పేరును కొట్టేసింది. ఈ వరుస హిట్ సినిమాల తర్వాత ఆమె క్రేజ్ మామూలుగా లేదు.

ఒక పక్కన కరోనా కారణంగా మిగతా అందరు హీరో హీరోయిన్లు రెమ్యూనరేషన్ లో తగ్గించుకుంటే ఈవిడ మాత్రం ఏ మాత్రం తగ్గడానికి ఆలోచించడం లేదు. ప్రస్తుతానికి ఈ అమ్మడు ప్రభాస్ సరసన రాధేశ్యామ్ అనే సినిమాలో అలానే అఖిల్ అక్కినేని సరసన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే సినిమాలో నటిస్తోంది. ఈ రెండు సినిమాలు కూడా మంచి అంచనాలున్న సినిమాలే కావడంతో రెమ్యునరేషన్ విషయంలో ఎక్కడా తగ్గడం లేదు.

అయితే ఈ భామ మొన్నటి దాకా పారితోషకం పెంచిందని గట్టిగ ప్రచారం అయితే జరిగింది కానీ ఈ అమ్మడు ఏకంగా డబుల్ చేసింది అనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇప్పటి దాకా ఒక్కో సినిమాకి కోటి నుంచి కోటిన్న‌ర మాత్ర‌మే తీసుకుంటున్న పూజా తాజాగా దాన్ని ఏకంగా రెండున్నర కోట్లకు పెంచిన‌ట్టు చెబుతున్నారు. అయితే ఈమెకు గోల్డెన్ లెగ్ అని పేరు రావడం అలానే ఈమె అంత క్రేజ్ ఉన్న హీరోయిన్స్ లేకపోవడంతో ఈమె ఎంత చెప్పినా ఈమె వెనుక పడుతున్నారు హీరోలు.  

మరింత సమాచారం తెలుసుకోండి: