నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రస్తుతం మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో భారీ ప్రతిష్టాత్మక సినిమా ఒకటి తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మిరియాల రవీందర్ రెడ్డి నిర్మాతగా ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై గ్రాండ్ లెవల్లో నిర్మితమవుతున్న ఈ సినిమాలో బాలకృష్ణకు జోడీగా ఒక యువ కథానాయిక నటించనున్నట్లు టాక్. అలానే బాలయ్య రెండు పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాని మంచి కమర్షియల్ ఎంటర్ టైనర్ గా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా దర్శకుడు బోయపాటి తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.

ఇక ఇటీవల బాలయ్య జన్మదినం సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ యూట్యూబ్ లో రిలీజ్ అయి ప్రేక్షకాభిమానుల నుండి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఎస్.ఎస్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు ఎంటర్టైన్మెంట్ అంశాలు కూడా ఉంటాయని, గతంలో బాలయ్య, బోయపాటి కలయికలో తెరకెక్కిన లెజెండ్, సింహా సినిమాల మాదిరిగానే ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ కొట్టడం ఖాయమని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా లాక్ డౌన్ కు ముందు రెండు భారీ షెడ్యూల్స్ జరుపుకున్న విషయం తెలిసిందే. ఇకపోతే రేపు ఈ సినిమా తదుపరి షెడ్యూల్ ని ప్రారంభించడానికి మూవీ యూనిట్ ఏర్పాట్లు చేసిందట.

కాగా రేపు ప్రారంభం కానున్న షెడ్యూల్ ని భారీ స్థాయిలో ఎక్కువ రోజులపాటు కొనసాగించనున్నారని దానితో సినిమా 70 శాతానికి పైగా పూర్తవుతుందని టాక్. అనంతరం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రారంభించి వచ్చే ఏడాది సమ్మర్లో ఈ సినిమాని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట దర్శకుడు బోయపాటి. మరి బాలయ్య బోయపాటి ల క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ కొడుతుందో తెలియాలి అంటే వచ్చే ఏడాది వేసవి వరకు వెయిట్ చేయక తప్పదు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: