ఎందుకో ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.
నాయకా ప్రాధాన్యం ఉన్న చిత్రాలకే నటి సోనాక్షి మొగ్గు చూపుతోంది. వాటికి ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తున్నదనే అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఏ పాత్రలోనైనా, ఎలాంటి సినిమాలోనైనా నటించగలిగే కథనాయకురాలిగా పేరు తెచ్చుకోవడం కోసమేనని అంటోంది. ఈ ముద్దుగుమ్మ నటించిన బాలీవుడ్ 'దబాంగ్' చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తరువాత సోనాక్షి వెనక్కితిరిగి చూడలేదు. వరుస అవకాశాలతో కెరీర్ బిజీగా గడుపుతోంది. కమర్షియల్ చిత్రాలు కాకుండా పాత్ర ప్రాధాన్యత ఉన్న చిత్రాలకే సోనాక్షి మొగ్గుచూపుతోంది. ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నదీ వివరించింది.
కమర్షియల్ చిత్రాలు తనకు చాలా ఇష్టమని తెలిపింది. వాటితోనే అభిమానుల్ని తాను సంపాదించుకోగలిగానని అంటోంది. ఆ ధైర్యంతోనే ప్రస్తుతం ప్రాధాన్యత ఉన్న పాత్రల్ని చేయలనుకుంటున్నట్లు వివరించింది. ప్రస్తుత అవకాశాలతో తాను సంతృప్తిగానే ఉన్నానంటోంది. ఎలాంటి చిత్రంలోనైనా, ఏ విధమైన పాత్రలోనైనా తాను చేయగలిగే పేరును సాధించుకోవలన్నదే తన అభిమాతమని చెప్పుకొచ్చింది. అలాంటి చిత్రాల్లో హీరో ఉన్నాడా, లేడా అనేది కూడా చూడనని స్పష్టం చేసింది. దీన్ని బట్టి గ్లామర్ పాత్రలకంటే నటిగా గుర్తింపు పొందాలనే కోరిక ఎక్కువగా ఉన్నట్లు అర్థమవుతోంది. అందాల ఆరబోత లేకుండా ఏ మేరకు రాణిస్తుందో తెలుసుకోవాలంటే ఎదురు చూడక తప్పదు. పరిశ్రమలోకి అడుగుపెట్టిన నాటి నుంచి ఇప్పటివరకు బ్రేక్ తీసుకొని సోనాక్షి కరోనా కారణంగా ఇంటికి పరిమితమైంది. గత పదేళ్ళలో మూడు పదులకి పైగా చిత్రాల్లో నటించింది.
లాక్ డౌన్ ప్రకటించే నాటికి సోనాక్షి ఒక వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ప్రస్తుతం మళ్ళీ అదే షూటింగ్ లో పాల్గొంటోంది. చివరిసారిగా 'దబాంగ్ 3' చిత్రంలో తెరపై కనిపించింది. ఇందులో సల్మాన్ ఖాన్, ముంజేకర్ ప్రధాన పాత్రల్లో నటించగా, కన్నడ సూపర్ స్టార్ సుదీప్ ముఖ్య పాత్రధారిగా కనిపించారు.