మహానటి తర్వాత పెంగ్విన్.. మిస్ ఇండియా.. గుడ్ లక్ సఖి అంటూ వరుస లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేసిన కీర్తిసురేష్.. వీటికి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. రిలీజ్కు రెడీగా ఉన్న గుడ్లక్ సఖి తర్వాత మరో లేడీ ఓరియెంటెడ్ మూవీ సైన్ ంచేయలేదు. ఇలాంటి చిత్రాల్లో ఎంత కష్టపడి నటించినా.. చివరికి ఓటీటీలో రిలీజ్ అయి.. తన కష్టం కనిపించడం లేదన్న ఫీలింగ్లో ఉంది కీర్తి. పెంగ్విన్ ఇప్పటికే ఓటీటీలో రిలీజ్ అయి ఫ్లాప్ కాగా.. మిస్ ఇండియా నెట్ ఫ్లిక్స్లో రిలీజ్ అవుతోంది. గుడ్ లక్ సఖి కూడా ఏదో ఒక ఓటీటీలో రావడం గ్యారెంటీ. ఇలా ఓటీటీకే పరిమితం కాకుండా... స్టార్స్ సినిమాలను ఓకె చేసేస్తోంది కీర్తి.
కీర్తి సురేష్ ఒక్కో భాషలో ఒక్కో స్టార్తో నటిస్తోంది. సర్కారు వారి పాటలో మహేశ్తో కలిసి ఆడిపాడుతోంది. మలయాళ సూపర్స్టార్ మోహన్లాల్తో నటించిన 'మరక్కర్' రిలీజ్ కు రెడీగా ఉంది. ఇక టాలీవుడ్కు వచ్చేసరికి మన్నాత్తే సినిమాలో రజనీతో జోడీ కడుతోందో? లేదంటే.. ఇంపార్టెంట్ రోల్లో కనిపిస్తోందోగానీ... మూడు భాషల్లో ముగ్గురు స్టార్స్ను చుట్టేసింది కీర్తిసురేష్.
ముగ్గురు సూపర్స్టార్స్తో నటిస్తున్న కీర్తి సురేష్ మెగాస్టార్ను కూడా కవర్ చేసేస్తోంది. ఆచార్య తర్వాత చిరంజీవి తమిళ హిట్ వేదళం రీమేక్లో నటిస్తాడు. ఇందులో చెల్లి పాత్రకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండడంతో.. చిరంజీవే కీర్తిసురేష్ పేరును రికమెండ్ చేశాడు. ఇలా తెలుగు, తమిళం.. మలయాళంలో స్టార్స్తో ఒకేసారి నటించే అరుదైన ఛాన్సులు అందుకుంటోంది కీర్తి.