మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాల లో నటిస్తూ బిజీగా ఉన్నారు.. ఖైదీ నంబర్ 150 సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చిన చిరు ఆ సినిమా తో బ్లాక్ బస్టర్ హిట్స్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.. ఆ తర్వాత పలు సినిమాలో నటించారు.. ఇప్పటికీ నటిస్తున్నారు. అయితే మొన్న వచ్చిన సైరా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. తర్వాత ఇప్పుడు మరో సినిమాలో నటిస్తున్నాడు...  ఆ సినిమానే ఆచార్య.. 



ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు.. ప్రస్తతం ఈ సినిమా నిర్మాణ దశలో ఉంది. కొన్ని నెలల ముందు ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ లాక్‌డౌన్ పరిస్థితుల కారణంగా  ఆరు నెలల పాటు షూటింగ్ ఆగిపోయింది. కరోనా నిబంధనలు పాటిస్తూ షూటింగు లు జరుపుకోవచ్చు నని ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ఈ మేరకు ఇండస్ట్రీ లోని చాలా మంది హీరోలు సినిమాలు చేయడానికి ముందుకు వస్తున్నారు.. కానీ చిరు మాత్రం ఆ సాహసం చేయలేక పోయాడు. కరోనా ప్రభావం పూర్తిగా తగ్గిన తర్వాతే ఈ సినిమాను చేద్దామని అనుకున్నాడు. అంతవరకు ఇంట్లోనే ఉంటానని చెప్పాడు.



చిరంజీవి ఇప్పుడు అభిమానులకు శుభవార్త చెప్పారని ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలుస్తోన్న సమాచారం.. ఆచార్య సినిమా షూటింగ్ లో పాల్గొనడానికి చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వార్త షికారు చేస్తోంది. నవంబర్ మూడో వారం నుంచి చిరంజీవి షూటింగ్‌లో పాల్గొంటారు. అంతకన్నా ముందు ఇతర నటీ నటుల తో కొరటాల శివ కొన్ని సన్నివేశాలు చిత్రీకరించనున్నారు... చిరంజీవి షెడ్యుల్ పూర్తవ్వగానే రామ్ చరణ్ తో ఉన్న కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.  మొత్తానికి ఈ వార్త మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ అనే చెప్పాలి.. త్వరలోనే సినిమాను పూర్తి చేసి విడుదల చేసే ఆలోచనలో చిత్రయూనిట్ ఉన్నారట..

మరింత సమాచారం తెలుసుకోండి: