హీరోలతో పోలిస్తే హీరోయిన్స్ కి రీల్ లైఫ్ పెద్దగా ఉండదు. అరవైలు దాటి డెబ్బై ల్లోకి వస్తున్నా మన హీరోలు సూపర్ హీరోల్లా స్టంట్ లు చేస్తారు. కానీ హీరోయిన్ 30 దాటుతుంది అనగానే వారికీ ఆఫర్ లు రావడం తగ్గిపోతూ ఉంటాయి. ఈ విషయంలో మనం ఎవరినీ తప్పు పట్టలేము. ఎందుకంటే సినిమాలు తీసే వాళ్ళు మనల్ని ఎంటర్ టైన్ చేయడం కోసమే కాదు వాళ్ళ బిజినెస్ కోసమే సినిమాలు తీస్తారు కాబట్టి. అయితే ఇప్పుడు ఈ విషయం అంతా ఎందుకు అంటే కీర్తి సురేష్ చేసిన పని ఈ విషయాన్నీ జ్ఞప్తికి తెచ్చింది అన్నమాట. ఇంతకీ కీర్తి ఏమి చేసింది అనుకుంటున్నారా ? ప్రస్తుతానికి కీర్తి సురేష్ టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న క‌థానాయిక‌ల్లో ఒకరిగా ఉంది.

ఎలాంటి వల్గారిటీ జోలికి వెళ్ళకుండా అలనాటి సౌందర్య లాగా అన్నీ పద్దతైన పాత్రలు చేసుకుంటూ ముందుకు పోతోంది కీర్తి. దానికి తగ్గట్టే ఆమెకు మంచి మంచి సినిమాల నుండీ మంచి మంచి ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. ఆమె లైనప్ చూస్తే మెంటల్ ఎక్కాల్సిందే. మిస్ ఇండియా, గుడ్ లక్ సఖి, రంగ్ దే, సాని కాయితం, అలానే మ‌హేష్ సర్కారు వారి పాట సినిమాలలో ఆమె నటిస్తోంది. ఇవి కాక ఆమె వేదాళం తెలుగు రీమేక్‌ లోనూ నటిస్తోందని అంటున్నారు.

మెహ‌ర్ ర‌మేష్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ సినిమాలో చిరు చెల్లెలుగా కీర్తి పేరు గట్టిగా వినిపిస్తోంది. ఈ సినిమాలో కీర్తిది త‌క్కువ నిడివి ఉన్న పాత్రే అయినా ఒక స్టార్ హీరో పక్కన మరో స్టార్ హీరోయిన్ చెల్లలి పాత్ర చేయదు కానీ కీర్తి మాత్రం రెమ్యునరేషన్ కోసం చేస్తుందని అంటున్నారు. చిన్న నిడివి ఉన్న పాత్రే అయినా హీరోయిన్‌గా ఎంత తీసుకుంటుందో, అంత‌కంటే కాస్త ఎక్కువ‌గానే రెమ్యునరేషన్ అడిగింద‌ని, కీర్తి  క్రేజ్ ఉన్న నటి కాబట్టి యూనిట్ కూడా దానికి సరే అనేసిందని అంటున్నారు.  అందుకే చెల్లెలి పాత్ర అయినా ఆమె ఒప్పెసుకుందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: