మళయాళ సినిమా రంగంలో చరిత్ర సృష్టించిన ‘అయ్యప్పన్ కోషియమ్’ మూవీ రీమేక్ హక్కుల కోసం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎందరో ప్రయత్నిస్తే చివరకు అనుకోకుండా సితార సంస్థకు దక్కింది. దీనితో ఈమూవీ రీమేక్ లో ఎవరు నటిస్తారు అన్న ఆశక్తితో ఇండస్ట్రీ వర్గాలలో విపరీతంగా చర్చలు జరిగాయి.


మొదట్లో అయ్యప్పన్ పాత్రను బాలకృష్ణ తో చేయించాలని చాల ప్రయత్నించారు. అయితే బాలయ్యకు ఈసినిమా నచ్చకపోవడంతో రవితేజా వద్దకు వెళ్ళారు. రవితేజా ఆలోచించి తన నిర్ణయాన్ని చెప్పే లోపుగా రంగంలోకి పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇవ్వడంతో ఈ ప్రాజెక్ట్ స్వరూపం పూర్తిగా మారిపాయింది.


ఇప్పుడు ఇక మిగిలింది ఈసినిమాకు సంబంధించిన మరొక హీరో పృథ్వీరాజ్  పాత్ర గురించి మాత్రమే. రానా ను ఇప్పటికే ఈ సినిమాలో నటించడానికి ఓకె చేసాడని వార్తలు రావడంతో పవన్ రానా ల కాంబినేషన్ సెట్ అయింది అని అనుకున్నారు అంతా. అయితే పవన్ రానా ల కాంబినేషన్ ఎంతవరకు సెట్ అవుతుంది అన్న అభిప్రాయం ఇప్పుడు ఈమూవీ నిర్మాతలలో ఏర్పడినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ కు యాటిట్యూడ్ ఎక్కువ అన్న ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. దీనికితోడు రానా కు కూడ యాటిట్యూడ్ ఎక్కు అని అంటారు.


 దీనితో వీరిద్దరి కాంబినేషన్ లో తీసే సన్నివేశాలలో వీరిద్దరిలోను ఉన్న యాటిట్యూడ్ వల్ల షూటింగ్ సమయంలో సమస్యలు వస్తాయా అన్న భయం ఇప్పుడు ఈ మూవీ నిర్మాతలలో ఏర్పడింది అని అంటున్నారు. ఈ ఆలోచనలతోనే ఈమూవీ ప్రకటనలో పవన్ కళ్యాణ్ పేరుతో కలిపి రానా పేరును ప్రకటించలేదు అని అంటున్నారు. దీనితో పవన్ యాటిట్యూడ్ కు తగ్గట్టుగా వ్యవహరిస్తూ నటన పరంగా పవన్ కు సరిసమానమైన ఒక యంగ్ హీరో గురించి అన్వేషణ కొనసాగుతున్నట్లు టాక్. అయితే మరికొందరైతే ఈమూవీలో నటించే విషయంలో రానా ఇంకా స్థిర నిర్ణయం తీసుకోలేదని అందుకే ఈ ఆలస్యం అని అంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: