ప్రముఖంగా వినిపించే పేరు నయనతార.. ఈ అమ్మడు నటించిన ఏ సినిమా అయిన సూపర్ హిట్ అవుతుండటం తో దర్శక నిర్మాతలు ఈమెతో సినిమా లు చేయడానికి మక్కువ చూపిస్తున్నారు. ఇమే తర్వాత టాలీవుడ్ లో వరుస హిట్ సినిమాలలో నటించి హిట్స్ ను తమ ఖాతాలో వేసుకున్న హీరోయిన్లు చాలా మందే ఉన్నారు.. రష్మిక మందన్న, పూజా హెగ్డే లు వరుస హిట్ సినిమాల తో దూసుకుపోతున్నారు.. ఇద్దరు కూడా ఇప్పుడు సినిమాలలో నటిస్తున్నారు. అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో రష్మిక నటించగా, పూజా ప్రభాస్ , అఖిల్ తో సినిమాలు చేస్తుంది..
ప్రస్తుతం ఏ హీరో అయిన వీరితో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. సంక్రాంతికి విడుదల అయి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న సినిమాలు సరిలేరు నీకెవ్వరు , అల వైకుంఠపురం లో ఈ సినిమాలలో రష్మిక, పూజా లు నటించారు. రెండు భారీ హిట్ ను అందుకోవడంతో హీరోయిన్లు కూడా ఒకేసారి రెమ్యునరేషన్ పెంచేశారు. పూజా రెండు మూడు సినిమాలతో బిజీగా ఉంది. ఇప్పటి నుంచి తన దగ్గరకు వస్తున్న నిర్మాతలకు షాక్ ఇచ్చింది. రూ.2.5-3 కోట్ల వరకు ఇవ్వాలని చెప్పడంతో నోరెళ్లబెడుతున్నారట. కరోనా సమయంలో సినీ ఇండస్ట్రీ బాగా దెబ్బ తిన్నది.. టాప్ హీరో, హీరోయిన్లు సైతం రెమ్యునరేషన్ తగ్గించుకుంటున్నారు..