అయ్యప్పన్ కోషియమ్ లో హీరోయిన్ పాత్ర చాలా స్వల్పంగా ఉంటుంది. తెలుగు రీమేక్ లో హీరోయిన్ పాత్రను కాస్త పెంచబోతున్నట్లుగా తెలుస్తోంది. కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించడంలో భాగంగా హీరో హీరోయిన్ మద్య పాటలు, రొమాంటిక్ సన్నివేశాలను కూడా చొప్పించబోతున్నారు. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో రూపొందబోతున్న ఈ రీమేక్ లో హీరోయిన్ పాత్రకు గాను సాయి పల్లవిని సంప్రదించారనే వార్తలు వస్తున్నాయి. నటనకు ఆస్కారం ఉన్న పాత్ర అవ్వడంతో సాయి పల్లవి నటించే అవకాశం ఉందని అంటున్నారు. ఇక పవర్ స్టార్ ఏ సోల్ నైనా ఈజీగా పట్టేయగలడు. ఇంకేంటి.. బొమ్మ దద్దరిల్లి పోవాల్సిందే. ఈ మూవీని డైరెక్ట్ చేసేది సాగర్ చంద్ర. అప్పట్లో ఒకడుండే వాడు ఏ రేంజ్ లో ఉంటుందో తెలిసిందే కదా. అలాంటి యంగ్ డైరెక్టర్ తీసే మూవీ కావడంతో.. లెక్కలు మారిపోయాయి.
సాయి పల్లవి కాకుంటే మరెవ్వరు ఈ సినిమాలో పవన్ కు జోడీగా నటిస్తారు అనేది కూడా ఆసక్తికరంగా ఉంది. మొత్తానికి పవన్ కు జోడీగా కనిపించబోతున్న ఆ గెస్ట్ హీరోయిన్ ఎవరు అనేది త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాను కేవలం నెల రోజుల వ్యవధిలోనే పూర్తి చేసేందుకు చిత్ర యూనిట్ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకు అనుగుణంగా హీరోయిన్ డేట్లు కూడా తీసుకోబోతున్నారు.