ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ న్యూస్ చదవండి... మెగాబ్రదర్ టవర్ స్టార్ నాగబాబు ప్రస్తుతం టీవీ షోలతో బిజీగా గడుపుతున్నారు. అలానే తన సొంత యూట్యూబ్ ఛానెల్ లో పలు రకాల వీడియోలు చేసి పెడుతుంటారు. ఇదిలా ఉండగా.. తనను తన కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ ఎవరైనా మాట్లాడితే మాత్రం ఊరుకోనని.. ఈ విషయంలో తను మంచోడ్ని కాదని అంటున్నారు. చాలా మంది తను కాంట్రవర్సీలు క్రియేట్ చేస్తానని అంటారని.. కానీ కాంట్రవర్సీలు చేయనని.. నిజాలు మాత్రమే మాట్లాడతానని అన్నారు. ఎదుటివారికి బాధ కలిగించే తప్పులు ఎప్పుడూ చేయనని అన్నారు.

తను ఎవరి జోలికి వెళ్లనని.. తన జోలికి ఎవరైనా వస్తే మాత్రం వదలనని అన్నారు. తనను, తన ఫ్యామిలీని టార్గెట్ చేసి నోటికొచ్చినట్లు మాట్లాడితే ఖచ్చితంగా ఎటాక్ చేస్తాననని.. ఆ విషయంలో అసలు మంచోడ్ని కానని అన్నారు. అయితే కాంట్రవర్సీలను ఎదుర్కొనే క్రమంలో అర్హత లేని వ్యక్తుల విమర్శలకు సమాధానాలివ్వనని చెబుతున్నారు. తనకు ఓపిక తక్కువ అని.. ఇంట్లో వాళ్లను లేదంటే ఇండస్ట్రీలో ఎవరినైనా ఏమైనా అంటే ఊరుకోనని.. మనకెందుకులే అని ఊరుకునే రకం నేను కాదంటూ చెప్పుకొచ్చాడు.

ఈ క్రమంలో కొంతమందికి సమాధానాలు ఇవ్వనని.. మనకి సాటి కాదన్నప్పుడు వాళ్లేమన్నా పట్టించుకోనని అన్నారు. ప్రస్తుతం నాగబాబు తన కూతురు నీహారిక పెళ్లి పనుల్లో బిజీగా గడుపుతున్నారు. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన న్యూస్ ల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి.. చాలా ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోండి...





మరింత సమాచారం తెలుసుకోండి: