పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా లో సందడి మొదలైంది.... అభిమానులు తమ అభిమాన తార ప్రముఖ అగ్ర హీరో పవన్ కళ్యాణ్ ను గత కొంతకాలంగా ఎలా మిస్ అయ్యారో.. మరిచిపోయే విధంగా ఇప్పుడు ఆయన వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు పవర్ స్టార్. అయితే ఆయన సినిమాలకి హీరోయిన్ ల వేటలో పడ్డాయి చిత్ర యూనిట్ లు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న రెండు చిత్రాల గురించి మాట్లాడుకుంటే వాటిలో హీరోయిన్ల పాత్ర నిడివి కాస్త తక్కువనే చెప్పాలి.... ప్రాముఖ్యత గురించి పక్కనపెడితే, కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పక్కన హీరోయిన్ అంటే ఆషామాషీ విషయం కాదు... అందుకనే ఆయనకు తగ్గ కథానాయకుల వేటలో పడ్డారు ఆ సినీ బృందాలు. ఇప్పుడు ఆ సినిమాలు ఏంటో చూద్దాం.

బాలీవుడ్  మూవీ 'పింక్' రీమేక్ వకీల్ సాబ్ లో పవన్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెల్సిందే. నిజానికి పింక్ లో హీరోకు జోడీ ఉండదు. కాని తెలుగులో కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం శృతి హాసన్ ను గెస్ట్ హీరోయిన్ గా నటింపజేస్తున్నారు. పలువురు హీరోయిన్స్ ను సంప్రదించిన తర్వాత చివరకు వకీల్ సాబ్ కోసం శృతి హాసన్ అయితే ఆ పాత్రకు సరిగ్గా ఫిట్ అవుతుందని ఎంపిక చేయడం జరిగింది.

ఇక ఆ తరువాత పవన్ కళ్యాణ్ నటించబోతున్న మలయాళి మూవీ "అయ్యప్పన్ కోషియమ్" రీమేక్ లో హీరోయిన్ విషయమై ప్రస్తుతం చర్చనీయాంశం అయింది. మలయాళంలో ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర చాలా తక్కువనే చెప్పాలి.... కానీ తెలుగులో మాత్రం కాస్త పెంచాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది..... కానీ ఈ సినిమాలో హీరోయిన్ రోల్ చాలా కీలకమైనదట అందుకే హీరోయిన్ విషయంలో కాస్త ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతోంది చిత్రబృందం.  ఎటువంటి క్యారెక్టర్ అయినా ఎంతో సహజంగా పండించే సాయి పల్లవి అయితే ఈ సినిమాకి బాగుంటుందని ఆమెను సెలెక్ట్ చేసినట్లు సమాచారం. కానీ అధికారికంగా మాత్రం ఇంకా ఎటువంటి ప్రకటన రాలేదు. పూర్తి సమాచారం కోసం మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: