అయితే ఇప్పుడు ఎక్కువగా జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణం ఏమిటనేది తెలియదు కానీ సినిమాలు విడుదల విషయంలో గతంలో మాదిరిగా లేకుండా అప్రమత్తంగా ఉండాలని భావిస్తున్నాడు. తన సినిమాలను విడుదల చేసే విషయంలో ఇతర హీరోల సినిమాలకు ఒక నెల రోజుల గ్యాప్ లో వుండే విధంగా ప్లాన్ చేస్తున్నాడట. దీనిద్వారా నిర్మాతలు కూడా ఇబ్బంది పడకుండా ఉంటారని జూనియర్ ఎన్టీఆర్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా నిర్మాతలను దృష్టిలో పెట్టుకుని అతను కొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నట్లు సమాచారం.
సినిమా విడుదల విషయంలో ప్రమోషన్ కి సంబంధించి ఎలాంటి పారితోషికం కూడా ఎక్కువగా వసూలు చేయకుండా జూనియర్ ఎన్టీఆర్ ముందుకు వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. ఈ కష్టకాలంలో ఇప్పుడు నిర్మాతలు ఎక్కువగా నష్టపోయిన సంగతి తెలిసిందే. దీంతో జూనియర్ ఎన్టీఆర్ వారి కోసం ఈ నిర్ణయం తీసుకున్నాడట. ఇప్పుడు సినిమాలను ప్రేక్షకులు ఎక్కువగా చూసే అవకాశాలు కనపడటం లేదు. దీనితోనే ఈ నిర్ణయం తీసుకున్నాడని అంటున్నారు. అయితే సినిమాలను వేగంగా విడుదల చేయాలని భావిస్తున్నా సరే తారక్ కి ముందు నుంచి లేట్ అవుతూనే ఉంది. కొన్ని సినిమాలు లేట్ అయినా పర్వాలేదు అని భావిస్తున్నాడు.