సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్లకు ప్రాధాన్యం ఎక్కువ. కోట్లాది రూపాయలు పెట్టుబడిగా పెడుతున్నప్పుడు ఆమాత్రం సెంటిమెంట్లు ఉండటం సహజం. క్రియేటివిటీ ఫీల్డ్ కావడంతో హీరో, హీరోయిన్లు, నిర్మాత, దర్శకులు.. ఇలా అందరూ సెంటిమెంట్లను గౌరవిస్తారు.. పాటిస్తారు. ప్రస్తుతం మెగా హీరో, సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కూడా ఇదే సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నాడని అంటున్నారు. తాను హీరోగా నటించిన ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా విడుదలపై నిర్మాతలకు ఇదే సూచిస్తున్నట్టు తెలుస్తోంది. గత ఏడాది తన సూపర్ హిట్ మూవీ ‘ప్రతిరోజూ పండగే’ డిసెంబర్ లోనే వచ్చిన సంగతి తెలిసిందే.

సోలో బ్రతుకే సో బెటర్ సినిమాకు డిసెంబర్ సెంటిమెంట్ నే ఫాలో అవుదామని చెప్తున్నాడట. ప్రస్తుతం అన్ లాక్ లో భాగంగా ధియేటర్లు ఓపెన్ చేసేందుకు అనుమతులు వచ్చాయి. అయినా.. కొన్నిచోట్ల ధియేటర్లు ఓపెన్ కాలేదు.. తెలంగాణలో అనుమతులు ఇంకా రాలేదు. ఏపీలో కరెంట్ బిల్లులు, జీఎస్టీ పన్నుపై ప్రభుత్వంతో చర్చలు నడుస్తూండగా.. తెలంగాణలో అసలు అనుమతులే ఇవ్వలేదు. ఇవన్నీ ఓ కొలిక్కి వచ్చేందుకు.. సినిమా రిలీజ్ అనుకుంటున్న డిసెంబర్ నెలకు మధ్య నెల గ్యాప్ ఉంది. దీంతో సినిమా విడుదలకు సెంటిమెంట్ తోపాటు పరిస్థితులు కూడా అనుకూలిస్తాయని సాయితేజ్ భావిస్తున్నట్టు సమాచారం.


ఆమధ్య వరుస ఫ్లాపులు చూసిన సాయితేజ్ చిత్రలహరితో గట్టెక్కాడు. ప్రతిరోజు పండగేతో సూపర్ హిట్ కొట్టి తానేంటో మళ్లీ ప్రూవ్ చేసుకున్నాడు. ప్రస్తుతం చేసిన ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాపై కూడా మంచి అంచనాలే నెలకొన్నాయి. దీంతో డిసెంబర్ సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నాడని అంటున్నారు. ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీలో వైరల్ అయింది. దీనిపై పూర్తి అఫిషియల్ న్యూస్ రివీల్ కావాల్సి ఉంది. సినిమాలో హీరోయిన్ గా నభా నటేశ్ నటించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: