సూపర్ స్టార్ మహేష్ బాబు తన తదుపరి చిత్రాన్ని దర్శకుడు పరశురాంతో ప్రకటించిన సంగతి తెలిసిందే. సర్కారు వారి పాట అనే పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ మరియు జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నాయి. సంగీత దర్శకుడు తమన్ సంగీతం కంపోజ్ చేస్తున్న ఈ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా నుండి ఇప్పటికే ప్రీ లుక్ పోస్టర్ మరియు మోషన్ పోస్టర్‌ను విడుదల చేసింది యూనిట్. ఆ ప్రమోషన్స్ దెబ్బకు ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే ముందు నుండీ ఈ సినిమా షూట్ ని యూనిట్ యుఎస్ఎలో సుదీర్ఘ షెడ్యూల్ ఒకటి ప్లాన్ చేసింది. ఈ షూట్ నవంబర్ మొదటి వారం నుండి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఇప్పటికీ యూనిట్ కొన్ని వీసా సమస్యలను ఎదుర్కొంతోంది. దీంతో ఇప్పటికే అమెరికా వెళ్లి లొకేషన్ సెర్చ్ లో ఉన్న డైరెక్టర్ ఇంకా లొకేషన్ ని ఫైనల్ చేయలేదు. అందువల్ల షూటింగ్‌ మొత్తాన్ని వచ్చే ఏడాదికి వాయిదా వేయాలని యూనిట్ నిర్ణయించినట్లు సమాచారం.

కాబట్టి తాజా సమాచారం ప్రకారం, సర్కారు వారి పాట షూటింగ్ జనవరి 2021 నుండి ప్రారంభమవుతుందని అంటున్నారు. ఈ సుదీర్ఘ యుఎస్ షెడ్యూల్ పూర్తయిన తర్వాత, మిగిలిన షూట్ భారతదేశంలో జరుగుతుంది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో మహేష్ బాబు రెండు డిఫరెంట్ లుక్స్ లో కనిపించనున్నాడని  అంటున్నారు. బ్యాకింగ్ మోసాల నేపధ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో మహేష్ మళ్ళీ పోకిరి లుక్ లో కనిపిస్తాడని అంటున్నారు. చూడాలి మరి ఈ సినిమా ఏమేరకు హిట్ అవుతుందో ?

మరింత సమాచారం తెలుసుకోండి: