అల వైకుంఠపురములో సినిమాతో సూపర్ హిట్ అందుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన నెక్స్ట్ సినిమా పుష్ప చేస్తున్నాడు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నరు. సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా సెలెక్ట్ అయిన విషయం తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా వస్తున్న ఈ సినిమా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ తో వస్తుందని తెలుస్తుంది.

కరోనా లాక్ డౌన్ తర్వాత నవంబర్ నుండి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది. రంపచోడవరం, మారేడిమిల్లి ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ చేస్తారని తెలుస్తుంది. సినిమా నవంబర్ లో మొదలు పెట్టినా 2021 రిలీజ్ కష్టమే అంటున్నారు. సినిమా తెలుగుతో పాటుగా తమిళ, హిందీ, కన్నడ, మళయాళ భాషల్లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. అందుకే సినిమా అందరిని సాటిస్ఫై చేసేలా స్క్రిప్ట్ ప్లాన్ చేస్తున్నారు.

సుకుమార్ సినిమా అంటే పర్ఫెక్ట్ ప్లానింగ్ తో చేస్తాడు. కాని షూటింగ్ మాత్రం అనుకున్న టైం కు పూర్తి చేయడం కష్టం. అందుకే తెలుస్తున్న సమాచారం ప్రకారం అల్లు అర్జున్ పుష్ప 2022లో వస్తుందని అంటున్నారు. ఆర్య, ఆర్య 2 తర్వాత సుక్కు, బన్నీ కలిసి చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. పుష్ప సినిమా పూర్తి కాగానే కొరటాల శివ సినిమా లైన్ లో ఉంది. ఈ సినిమాను కూడా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తున్న కొరటాల శివ బన్నీ సినిమాను కూడా ఓ సోషల్ మెసేజ్ తో తెరకెక్కిస్తాడని టాక్.                                                      



మరింత సమాచారం తెలుసుకోండి: