కొన్ని కొన్ని కాంబినేషన్ లకు కాల్ట్ ఫ్యాన్స్ ఉంటారు. అటువంటి కాంబినేషన్ ఎప్పుడు రిపీట్ అయినా ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు. అలాంటి కాంబినేషన్ లలో బోయపాటి- బాలయ్య కాంబినేషన్ ఒకటి. బాలయ్య-బోయపాటి కాంబినేషన్ అంటే నందమూరి అభిమానులకు పూనకాలే. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘సింహా’, ‘లెజెండ్’ సినిమాలు ఎంతటి సంచలన విజయాలు నమోదు చేశాయో అందరికీ తెలిసిందే. ఈ కాంబినేషన్ రిపీట్ కావాలని ఎన్నో రోజులుగా అభిమానులు కోరుకుంటున్నారు.

 బాలయ్య వందవ సినిమా కి ఈ కాంబినేషన్ ఆల్మోస్ట్ రిపీట్ అవుతుందని అందరూ భావించారు అయితే ఎందుకో ఈ కాంబినేషన్ అప్పుడు కుదరలేదు. తర్వాత బాలయ్య బాబు ఉ ఇతర కమిట్మెంట్ లతో బిజీ అయిపోయి పైసా వసూల్ జై సింహ వంటి సినిమాలు చేశారు. అలాగే బోయపాటి బెల్లంకొండ శ్రీనివాస్ తో జయ జానకి నాయక సినిమాతో పాటు రామ్ చరణ్ తో వినయ విధేయ రామ సినిమా చేశారు. అయితే బోయపాటి డైరెక్షన్ లో వచ్చిన వినయ విధేయ రామ సినిమా కి తీవ్ర విమర్శలు ఎదుర్కొవటం వల్ల బోయపాటి ఇ రేంజ్ కొంచెం తగ్గిందనే చెప్పాలి అయితే తనేంటో మళ్లీ నిరూపించుకోవాలి అంటే పక్కాగా తనకు తన కథకు సెట్ అయ్యే హీరోను పెంచుకోవాలని తరువాతి సినిమాకు బాలయ్య బాబు ను ఎంచుకున్నారు.

అయితే ఈ కాంబినేషన్ తో సినిమా వస్తుందనగానే బాలయ్య బాబు అభిమానులకి పండగే కాబట్టి తాజాగా వీరిద్దరూ మరో సినిమా చేస్తున్నారు. బాలయ్య బర్త్ డే సందర్భంగా విడుదలైైన ఫస్ట్ రోర్ అందర్నీ  ఆకట్టుకుంది.  గతంలో ఒక షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. తాజాగా పరిస్థితులు కాస్త కుదుటపడటంతో షూటింగ్ రీ స్టార్ట్ చేశారు. బాలయ్య.. చాలా నెలల తర్వాత తిరిగి సెట్లో అడుగుపెట్టనున్నారు. ఈ మేరకు గురువారం నుంచి తమ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని దర్శకుడు బోయపాటి శ్రీను ఫేస్బుక్లో పోస్ట్ పెట్టారు. దాదాపు ఏడు నెలల విరామం తర్వాత మళ్లీ ఇప్పుడు ప్రారంభమైంది. ఈ చిత్రానికి  తమన్ సంగీతం అందిస్తుండగా… మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. మరి ఈ చిత్రంతో ఈ ద్వయం హ్యాట్రిక్ నమోదు చేస్తుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: