ఇటీవల అనుష్క మాధవన్ ల కాంబినేషన్ లో నిశ్శబ్దం అనే సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా భారీ అంచనాలతో రిలీజ్ అయినా భారీగా దెబ్బ వేసింది. ఆమెజాన్ కి అమ్మేసుకుని బతికి పోయారు కానీ బయట రిలీజ్ చేసి ఉంటే నిర్మాతలు దారుణంగా నష్ట పోయేవారు. అయితే అసలు విషయం ఏమిటంటే ఈ సినిమా చూసిన ఒక అనుష్క ఫ్యాన్ చేసిన కామెంట్ ఇప్పుడు కాస్త ఆసక్తికరంగా మారింది. అదేంటి అంటే నిజానికి అనుష్క, మాధవన్ లు ఈ సినిమా కంటే ముందే పద్నాలుగేళ్ళ క్రితం రెండు అనే తమిళ సినిమాలో నటించారు. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి నటించలేదు.

ఇన్నాళ్లకి అంటే పద్నాలుగేళ్ళ ఈ కాంబినేషన్ మళ్ళీ సెట్ అయింది. అయితే అది ఫెయిల్ అయింది అనుకోండి. అయితే ఈ రెండు సినిమాలో అనుష్క చనిపోతుందట. ఇక నిశ్శబ్దం సినిమాలో ఏమో మాధవన్ చనిపోతాడు. దీంతో మరి సదరు అనుష్క ఫ్యాన్స్ డిజప్పాయింట్ అయినట్టుంది అందుకే ఈ ఇద్దరి జంటకి ఎప్పుడూ ట్రాజిక్ ఎండింగ్ ఏనా ? ఈ సారి ఒక మంచి సినిమాలో మంచి ఎండింగ్ ఇవ్వాలని కోరుతున్నాడు.

మరి చూడాలి ఆ ఫ్యాన్ కోరిక ఎప్పటికయినా తీరుతుందేమో ? ఇక అనుష్క సినిమాల విషయానికి వస్తే ఆమె ఇంకా ఎటువంటి సినిమాలు ఒప్పుకోలేదు. రెండు సినిమాలు ఒప్పుకున్నానని ఆమె ప్రకటించినా ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు కాబట్టి ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్నారు. ఒకటి మహేష్ అనే దర్శకుడితో ప్రభాస్ సొంత బ్యానర్ అయిన యూవీ క్రియేషన్స్ లో చేస్తున్నట్టు చెబుతున్నా ఆ విషయం మీద క్లారిటీ అయితే లేదు. అయితే అది కూడా హారర్ జానర్ అని చెబుతుండడంతో ఆ సినిమా డౌటే మరి.
 

మరింత సమాచారం తెలుసుకోండి: