బాహుబలి తర్వాత ప్రభాస్ క్రేజ్ పెరిగిపోయింది. అందుకే అయన ఏ సినిమా చేసినా అది ప్యాన్ ఇండియా లెవల్ లోనే చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన రాధే శ్యామ్ సినిమా చేస్తున్నాడు. ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని పీరియాడిక్ లవ్ స్టోరీగా జిల్ సినిమా ఫేమ్ దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా షూట్ విషయమే ఇంకా క్లారిటీ లేదు. ఎందుకంటే ఈ సినిమా షూట్ చాలా వరకూ పెండింగ్ ఉంది.

 అందుకే భారీగా కరోనా కేసులు నమోదు అవుతున్నా ఈ టీమ్ అంతా రిస్క్ చేసి ఇటలీ వెళ్లారు. మొన్నీమధ్యనే ఇటలీలో షూటింగ్ కు గాను అక్కడకు వెళ్లి కీలక షెడ్యూల్ ను ప్లాన్ చేసారు. అక్కడకి వెళ్ళిన వెంటనే షూట్ ప్రారంభించక కాస్త లేట్ చేశారు. అయితే అక్కడ కరోనా కేసులు ఇప్పుడు భారీగా నమోదవుతున్న క్రమంలో రాధే శ్యామ్ టీమ్ అక్కడ షూటింగ్ ను ముగించే పనిలో ఉన్నారని గట్టిగానే ప్రచారం జరిగింది.

అయితే ఆ మాట నిజమే కానీ షూట్ పూర్తి కాకుండా ముగించడం లేదు. ఈ సినిమా షూట్ అక్కడ పూర్తి చేసేసినట్టు చెబుతున్నారు. ఈ క్రమంలో అక్టోబర్ 31న భారత్ కు మళ్ళీ తిరుగు ప్రయాణం కానున్నట్టు చెబుతున్నారు. అంటే ఇంతా కష్టపడి వెళ్ళినందుకు వాళ్ళ పని పూర్తి అయినట్టు చెబుతున్నారు. ఇక ఈ సినిమాకి సంగీత దర్శకుడు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తుండగా యూవీ క్రియేషన్స్ - గోపీ కృష్ణా మోవీస్ బ్యానర్ లు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి. అయితే ఈ సినిమాని ప్రభాస్ సోదరి ( కృష్ణం రాజు కుమార్తె) ప్రశీద సమర్పించడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: