ఖైది నెంబర్ 150 సినిమా తో తన రీ ఎంట్రీ లో చిరంజీవి అదరరగొట్టే సినిమా చేసిన చిరు ఆ తర్వాత  సైరా మరో హిట్ కొట్టి తనలో చావ తగ్గిపోలేదని నిరూపించుకున్నాడు.. ఆ రెండు హిట్ సినిమా లతో చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమా లో నటిస్తున్నారు,. ఇప్పటివరకు పరాజయం అన్నది తెలియని కొరటాల శివసినిమా కి దర్శకుడు..  ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ కూడా మొదలు పెట్టుకుంది.. ఇటీవలే వచ్చిన మోషన్ పోస్టర్ కి అందరు ఫిదా అయ్యారు కూడా.. అయితే కరోనా లాక్ డౌన్ తర్వాత ఈ సినిమా షూటింగ్ ఇంకా మొదలుపెట్టలేదు. ఇతర హీరోలు మాత్రం తమ సినిమా లు మొదలుపెట్టేసి పూర్తి చేసే దిశగా సాగిపోతున్నారు.

ఇప్పటికే నాగార్జున వైల్డ్ డాగ్ సినిమా ని మొదలుపెట్టేశాడు..బాలకృష్ణ కూడా రంగలోకి దిగారు..బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న కొత్త చిత్రం షూటింగ్ గురువారమే పున:ప్రారంభం అయింది. ఈ విషయాన్ని బోయపాటి స్వయంగా ఫేస్ బుక్ ద్వారా వెల్లడించాడు. ‘బీబీ3’గా పిలుచుకుంటున్న తమ చిత్ర షూటింగ్ పున:ప్రారంభం అయినట్లుగా పోస్ట్ పెట్టాడు. ఈ సినిమా కోసం బాలయ్య నిర్విరామంగా పని చేయబోతున్నాడట. ప్రస్తుత షెడ్యూల్లో సినిమాకు సంబంధించి కీలక సన్నివేశాల చిత్రీకరణ జరపనున్నారట. కానీ చిరు మాత్రం సినిమా ని మొదలుపెటకపోవడంమెగా అభిమానులను కలవరపరుస్తుంది.

సినిమా తర్వాత వివి వినాయక్ దర్శకత్వంలో చిరు సినిమా చేయబోతున్నాడు చిరు. ఇది మలయాళ సినిమా లూసిఫర్ కి రీమేక్.. ఆచార్య సినిమా తర్వాత ఇది ఉండబోతుంది..ఎప్పటి లాగే కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ తో కలిసి ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తారు. ఇక వినాయక్ చిరంజీవి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా తో వారు హ్యాట్రిక్ కొట్టాలని చూస్తుండగా ఠాగూర్, ఖైదీ నెంబర్ 150 సినిమాలు ఏ రేంజ్ లో హిట్ అయ్యాయో అందరికి తెలిసిందే.. ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం ఓ యంగ్ హీరో ను సంప్రదిస్తున్నట్లు తెలుస్తుంది.. మరి ఆ లక్కీ ఛాన్స్ ఎవరిని వరిస్తుందో చూడాలి.. మరోవైపు బాబీ, మెహర్ రమేష్ లకు చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు..

మరింత సమాచారం తెలుసుకోండి: