ఈ నేపథ్యంలో సంక్రాంతి టార్గెట్ గా విడుదలవుతున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమాకోసం హీరో అఖిల్ పెద్ద సాహసమే చేయబోతున్నారని తెలుస్తోంది. సినిమా రిలీజ్ రోజు నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన టూర్ ప్లాన్ చేసుకుంటున్నారట. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా కూడా.. జనాల్లోకి వెళ్లాలని అఖిల్ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. అఖిల్ సక్సెస్ టూర్ ప్లాన్ చేస్తే.. లాక్ డౌన్ తర్వాత ధైర్యంగా జనాల్లోకి వెళ్లిన తొలి హీరోగా రికార్డ్ సృష్టించడం మాత్రం ఖాయం.
దసరా సందర్భంగా విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. అల్లు అరవింద్ సమర్పణలో జిఎ-2 బ్యానర్లో బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమాకు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకుడు. పూజా హెగ్డే హీరోయిన్. భలే భలే మగాడివోయ్, గీతాగోవిందం చిత్రాలకి సంగీతాన్ని అందించిన గోపీ సుందర్, అఖిల్ మూవీకి మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే 80% షూటింగ్ ని పూర్తిచేసుకున్న రొమాంటిక్ ఫ్యామిలి ఎంటెర్టైనర్ సంక్రాంతి కానుకగా రానుంది. మురళీ శర్మ, ఆమని, సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హిట్ కోసం ఆశగా ఎదురు చూస్తున్న అఖిల్.. సంక్రాంతికి సినిమా విడుదల చేసి తెలుగు రాష్ట్రాల్లో పర్యటించి వస్తానంటున్నారు.