ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా రాధేశ్యామ్. యు.వి.క్రియేషన్స్, గోపి కృష్ణ మూవీస్ సంస్థలు కలిసి సంయుక్తంగా ఎంతో భారీ ఖర్చుతో నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ కు జోడిగా పూజాహెగ్డే నటిస్తుండగా కృష్ణంరాజు, భాగ్యశ్రీ, ప్రియదర్శి షాషా ఛత్రి, మురళీశర్మ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ ఇటలీలో జరుగుతున్న విషయం తెలిసిందే.

కరోనా కారణంగా విధించబడిన లాక్‌డౌన్‌ వల్ల ఈ సినిమా షూటింగ్ చాలా రోజుల పాటు ఆగిపోవడం జరిగింది. ఇకపోతే ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా జస్టిన్ ప్రభాకరన్ ని ఇటీవలే ఎంపిక చేసింది మూవీ యూనిట్. తమిళంలో పలు సక్సెస్ఫుల్ సినిమాలకు సంగీతం అందించి మంచి పేరు దక్కించుకున్న జస్టిన్ ప్రభాకరన్ ఇటీవల విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన డియర్ కామ్రేడ్ సినిమాకు తెలుగు లో మ్యూజిక్ అందించడం జరిగింది. ఆ సినిమా ఆశించిన రేంజ్ లో సక్సెస్ కానప్పటికీ అందులోని పాటలు మాత్రం శ్రోతలను ఎంతగానో అలరించాయి. ఇకపోతే ప్రస్తుతం రాధేశ్యామ్ సినిమాకి కూడా అతడు మ్యూజిక్ అందిస్తుండటంతో అందరి దృష్టి దీనిపై పడింది.

మరో వైపు ఈ సినిమాకు దర్శకుడిగా వ్యవహరిస్తున్న రాధాకృష్ణ కుమార్ గతంలో గోపీచంద్ తో తెరకెక్కించిన జిల్ మూవీ సాంగ్స్ నీ అదరగొట్టే రేంజ్ లో కంపోజ్ చేయించారు. ఆ సినిమా ఆశించినంత సక్సెస్ ని అందుకోలేనప్పటికీ అందులో సాంగ్స్ మాత్రం యువతను విశేషంగా ఆకట్టుకున్నాయి. కాగా ఆ సినిమాకు సంగీత దర్శకుడిగా జీబ్రాన్ పనిచేసిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం తెరకెక్కుతున్న రాధేశ్యామ్ సాంగ్స్ విషయమై కూడా రాధాకృష్ణ కుమార్ ఎంతో శ్రద్ధ వహించారని, ప్రతి ఒక్క పాట యువతతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ట్యూన్స్ ని కంపోజ్ చేయిస్తున్నారని అంటున్నారు. ఒకరకంగా ఈ సినిమాలోని సాంగ్స్ రేపు బయటకు వచ్చిన తర్వాత అందరిలోకి దూసుకెళ్లడం ఖాయమని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోందట. మరి ప్రచారం అవుతున్న ఈ వార్త నిజమే అయితే ఇది నిజంగా రెబల్ స్టార్ ఫ్యాన్స్ కు పెద్ద పండుగ అని చెప్పక తప్పదు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: