తన కెరీర్లో ఎన్నడూ లేనంతగా స్పీడ్ గా వరుసగా సినిమాలు ఎంచుకుంటూ కొనసాగుతున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇక ప్రస్తుతం ఆయన రెండు సినిమాలు చేస్తున్నారు. వాటిలో ఒకటి వకీల్ సాబ్ కాగా మరొకటి క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడికల్ సినిమా. అయితే  వీటిలో వకీల్ సాబ్ సినిమా ఇప్పటికే 80 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకోగా క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న  సినిమా మాత్రం రెండు భారీ షెడ్యూల్స్ ని పూర్తి చేసుకోవడం జరిగింది.

ఇక ఈ రెండు సినిమాల అనంతరం పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఒక సినిమాతో పాటు ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్ళూరి నిర్మాతగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కనున్న మరో సినిమా కూడా చేయనున్నారు. ఇక వీటితో పాటు అతిత్వరలో సాగర్ చంద్ర దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మించనున్న అయ్యప్పన్ కోషియం తెలుగు రీమేక్ లో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి కొద్ది రోజుల క్రితం అధికారికంగా ప్రకటన కూడా రావడం జరిగింది.

ఇక పోతే ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ గా కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి మా ఏపీహెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి తొలుత ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్ర గాను నందమూరి బాలకృష్ణ ఎంపిక చేశారని, ఆయన కూడా ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చారని సమాచారం. కానీ ఆ తరువాత కొన్ని అనుకోని కారణాల వల్ల ఆయన సినిమా నుండి తప్పుకోవటంతో అది పవన్ వద్దకు చేరటం, ఎట్టకేలకు సినిమా చేయడానికి పవన్ పచ్చజెండా ఊపడం జరిగిందని అంటున్నారు. కాగా ప్రస్తుతం మీడియా మాధ్యమాల్లో ప్రచారం అవుతున్న ఈ వార్తలో పూర్తి వాస్తవాలు వెల్లడి కావాల్సి ఉంది... !!

మరింత సమాచారం తెలుసుకోండి: