అసలైతే 2020లోనే ఈ సినిమా రిలీజ్ అనుకోగా పరిస్థితులు ఏమి అనుకూలించలేదు. ఇదిలాఉంటే ఆర్.ఆర్.ఆర్ తర్వాత రాజమౌళి మహేష్ తోనే సినిమా చేస్తాడని ఇప్పటికే క్లారిటీ ఇచ్చాడు. అయితే ట్రిపుల్ ఆర్ తర్వాత నెక్స్ట్ ఓ స్మాల్ బడ్జెట్ సినిమా చేయాలని చూస్తున్నాడట రాజమౌళి. ట్రిపుల్ ఆర్ తర్వాత వెంటనే మహేష్ సినిమా చేస్తే అంచనాలు భారీగా ఉంటాయని.. అందుకే మర్యాద రామన్నలా ఓ చిన్న బడ్జెట్ తో ఓ సినిమా చేయాలని అనుకుంటున్నాడట రాజమౌళి.
జక్కన్న ప్లాన్ వరకు బాగానే ఉన్నా ఆయన చిన్న సినిమా చేసినా అందులో కూడా చాలా విషయం ఉండాల్సిందే. నేషనల్ వైడ్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న తర్వాత ఆయన చిన్న బడ్జెట్ సినిమాలు చేస్తానన్న ఆడియెన్స్ ఒప్పుకోరు. మరి రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ తర్వాత ఎలాంటి సినిమా చేస్తాడో చూడాలి. ఒకవేళ మహేష్ తో సినిమా ఎనౌన్స్ చేస్తే మాత్రం ఆ సినిమాకు ఎలా లేదన్నా మరో రెండేళ్లు టైం తీసుకునే ఛాన్స్ ఉంటుంది. మహేష్ ఆల్రెడీ పరశురాం తో సర్కారు వారి పాట చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత త్రివిక్రం తో సినిమా ప్లానింగ్ తో ఉన్నట్టు టాక్.