టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వరుస విజయాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన తొలి సినిమా శ్రీమంతుడు. అప్పట్లో మంచి అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పెద్ద ఇండస్ట్రీ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. దాని అనంతరం మరోసారి మహేష్ బాబు తో కొరటాల శివ తీసిన భరత్ అనే నేను సినిమాలో మహేష్ ముఖ్యమంత్రి పాత్ర పోషించగా దీనిని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించడం జరిగింది. ఇక ఈ సినిమా ద్వారా తొలిసారిగా బాలీవుడ్ నటి కియారా అద్వానీ టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయమైంది.

కాగా రిలీజ్ అనంతరం ఈ సినిమా కూడా భారీ సక్సెస్ ని అందుకున్న విషయం తెలిసిందే. ఆ విధంగా ఫస్ట్ సినిమాతోనే బెస్ట్ హిట్ అందుకున్న కియారా అద్వాని ఆపై మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శీను దర్శకత్వంలో తెరకెక్కిన వినయ విధేయ రామ సినిమాలో కూడా హీరోయిన్ గా నటించింది. అయితే ఆ సినిమా మాత్రం బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో ఆపై ఆమె ఎక్కువగా వరుసగా బాలీవుడ్ లోనే సినిమాలు చేస్తూ కొనసాగుతున్నారు. ఇక అతి త్వరలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఆదిపురుష్ అనే హిస్టారికల్ మూవీలో సీత పాత్రలో ఆమె నటించనునంట్లు వార్తలు వస్తున్నాయి.


ఇక మరోవైపు కొన్ని లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల నుండి మా ఏపీ హెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి అతి త్వరలో బన్నీ హీరోగా వాసువర్మ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కనున్న ఐకాన్ సినిమాలో బన్నీకి జోడీగా కియారా అద్వానీ హీరోయిన్ గా ఎంపికైనట్లు సమాచారం. ఇప్పటికే ఈ విషయమై దిల్ రాజు కియారా అద్వానీని సంప్రదించడం, అలానే ఆమె డేట్స్ కూడా తీసుకోవటం జరిగిందని, అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమా వచ్చే ఏడాది ద్వితీయార్థంలో పట్టాలెక్కే ఛాన్స్ ఉందని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త గనుక నిజమైతే మరొకమారు టాలీవుడ్ తెరపై కియారా అద్వానీని చూడవచ్చన్న మాట....!!

మరింత సమాచారం తెలుసుకోండి: