ప్రభాస్ హీరోగా తెరకెక్కిన బాహుబలి రెండు భాగాల సినిమాల అత్యద్భుత సక్సెస్ తర్వాత దేశవిదేశాల్లో కూడా విపరీతమైన ప్రేమ ఖ్యాతిని అందుకున్నారు దర్శక దిగ్గజం రాజమౌళి. కోలీవుడ్, బాలీవుడ్ సహా పలు ఇతర ఇండస్ట్రీ ల్లో ఎందరో దర్శకులు ఉన్నప్పటికీ కూడా అందరి దృష్టి ఎక్కువగా రాజమౌళి పైనే ఉందని చెప్పాలి. ఇక ప్రస్తుతం ఆయన తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడం ఖాయమని పలువురు ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.
తొలిసారిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ నటిస్తుండగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దాదాపుగా రూ. 500 కోట్ల రూపాయల భారీ ఖర్చుతో దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకోగా దీని తాజా షెడ్యూల్ ఇటీవలే హైదరాబాద్లో ప్రారంభించారు. ఒలీవియా మోరిస్, అలియా భట్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో అజయ్ దేవగన్, శ్రియా శరణ్, రాహుల్ రామకృష్ణ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాని మొదట ఈ ఏడాది జులై 30న రిలీజ్ చేద్దాం అనుకున్నారు అయితే విఎఫ్ఎక్స్ పూర్తికాకపోవడంతో దానిని వచ్చే ఏడాది సంక్రాంతికి వాయిదా వేశారు. కానీ మధ్యలో కరోనా మహమ్మారి రావడం దానితో కొన్ని నెలలపాటు మనదేశంలో లాక్ డౌన్ విధించడంతో ఆర్ఆర్ఆర్ షూటింగ్ వాయిదా పడటం జరిగింది. ఇక లేటెస్ట్ గా కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి మా ఏపీ హెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమాని వచ్చే ఏడాది జూలైలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ప్రణాళికలు రచిస్తున్నారట రాజమౌళి.

ఇప్పటికే సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా ప్రారంభమయ్యాయని, మరోవైపు విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ కూడా ప్రారంభమైందని అన్ని అనుకున్నట్లు జరిగితే పక్కాగా సినిమాని జూలై లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే చాన్స్ ఉందని అంటున్నారు. నిజానికి ఈ సినిమాని వచ్చే ఏడాది సమ్మర్లో రిలీజ్ చేస్తారని కొంత వార్తలు ప్రచారం అవుతున్నప్పటికీ అది సాధ్యమయ్యే పరిస్థితే లేదని మరికొందరు అంటున్నారు. ఆ విధంగా అనుకున్నదొకటి అయితే ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ విషయంలో జరగబోతోంది మరొకటి అనే విధంగా ఈ సినిమా వచ్చే ఏడాది జులై వచ్చే ఛాన్స్ ఎక్కువ అని అంటున్నారు. మరి పక్కాగా వచ్చే ఏడాది జూలైలో అయినా ఈ సినిమా రిలీజ్ అవుతుందా లేదా అంటూ కొందరు ప్రేక్షకులు అనుమానం వ్యక్తం చేస్తూ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కామెంట్స్ చేస్తున్నారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: