ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. ప్రస్తుతం టాలీవుడ్ లో అగ్ర హీరోయిన్ గా దూసుకుపోతుంది పూజా హెగ్దే.తన హాట్ హాట్ అందాలతో కుర్రకారుల మతులు పోగొడుతుంది ఈ హాట్ బ్యూటీ. తన గ్లామర్ షోలతో అందరిని పిచ్చెక్కిస్తుంది. ఇక కరోనా కారణంగా సినీ పరిశ్రమకు పెద్ద దెబ్బ పడిన  క్రమంలో కొంతమంది హీరోయిన్లు పారితోషికం తగ్గించుకోవడానికి రెడీ అయ్యారు. కీర్తి సురేష్ తో పాటు ‘ప్రభాస్21’ లో నటించబోతున్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె కూడా సినిమా పూర్తయ్యాకే పారితోషికం తీసుకుంటానని అడ్వాన్స్ తిరిగిచ్చేసిందట.

కాని ఈ హాట్ బ్యూటీ పూజ హెగ్దే మాత్రం పారితోషికం తగ్గించుకునే విషయంలో ససేమిరా అందట. ప్రస్తుతం అక్కినేని అఖిల్ తో "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్" సినిమాలో నటిస్తుంది. ఇటీవల ఈ బుట్టబొమ్మను ఓ ప్రాజెక్టు కోసం దర్శక నిర్మాతలు సంప్రదిస్తే.. ఏకంగా రూ2.5 కోట్ల పారితోషికం చెప్పిందట. దాంతో వారు వెనకడుగు వేసినట్టు తెలుస్తుంది.
ఇప్పుడు మరో ముద్దు గుమ్మ కూడా పూజ బాటలోనే నడుస్తున్నట్టు తెలుస్తుంది. ఆమె ఎవరో కాదు. క్యూట్ అండ్ హాట్ బ్యూటీ రష్మిక మందన.


వివరాల్లోకి వెళితే.. శ‌ర్వానంద్ హీరోగా కిశోర్ తిరుమల డైరెక్షన్లో తెర‌కెక్కుతున్న `ఆడాళ్లూ మీకు జోహార్లూ` చిత్రం కోసం ర‌ష్మిక ఏకంగా 1.75 కోట్ల పారితోషికం అందుకుంటుందట‌. నిజానికి ఆమె 2కోట్లు డిమాండ్ చేసిందట.. తరువాత దర్శకనిర్మాతల భేరసారాల తరువాత రూ.1.75 కోట్లకు ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం బన్నీ సరసన సుకుమార్ డైరెక్షన్ లో "పుష్ప" సినిమాలో నటిస్తున్న ఈ ముద్దు గుమ్మ  ఈ ఏడాది సంక్రాంతికి  సూపర్ స్టార్ మహేష్ బాబుతో "సరిలేరు నీకెవ్వరూ" సినిమాలో నటించింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఈ అమ్మడు ఒక్కసారిగా పెద్ద స్టార్ హీరోయిన్ అయిపోయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: